వదిన వరుసకు అయ్యే మహిళను అత్యంత దారుణంగా రేప్ చేసి ఆ తరువాత ఆమె జననాంగాన్ని కోసేసిన ఘటన కృష్ణ జిల్లా మైలవరంలో చోటు చేసుకుంది. బాబు అనే వ్యక్తి జి.కొండూరు మండలం మునగపాడులో నివాసం ఉంటున్నాడు. అదే గ్రామం లో నివాసం ఉంటున్న వదిన వరుసయ్యే మహిళ పై కన్నేశాడు ఈ కామాంధుడు. ఎవ్వరు లేని సమయం చూసి ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత రాక్షసంగా జననాంగాన్ని కోసి పరారయ్యాడు. ఆ మహిళ 100 డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళ పూర్తిగా కోలుకున్నాక స్టేట్ మెంట్ తీసుకోనున్నారు పోలీసులు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వస్తున్న కామాంధుల తీరు మాత్రం మారట్లేదని గ్రామస్తులు, బాధిత మహిళ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.