లోకమంతా డెకరేషన్ ముసుగులో బతుకుతోంది. వాస్తవానికి దూరంగా ఎటో వెళ్ళిపోతుంది. రంగుల పూతతో కోట్ల వ్యాపారం జరిగిపోతోంది. దీని పర్యవసానం పర్యావరణం, ప్రజల ఆరోగ్యం నాశనం అయిపోతోంది.
మనిషిని ఆకట్టుకోడానికి వాడిపోయిన కూరగాలయకు, ఆకు కూరలకు సైతం రసాయనాలు పూత పూసి బజార్లో అమ్మేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని పాతరేస్తున్నారు.
అన్నిటా కెమికల్స్,అంతటా కెమికల్స్. మామిడిపండ్లను మాగబెట్టేందుకు, పండ్లు పాడైపోకుండా ఉండేందుకు కెమికల్స్ వాడుతున్నారు. పండ్లు నిగనిగలాడేలా కనిపించేందుకు రసాయనాలు పూస్తున్నారు. ఇది కూడా అలాంటి ఘటనే.
ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆకుకూరలను ఫ్రెష్ గా ఉంచేందుకు కెమికల్ లో ముంచుతున్నారు.
వాడిపోయిన ఆకులను రసాయనంలో ముంచిన కొద్దిసేపటికి కెమికల్ ఎఫెక్ట్ తో అవి విచ్చుకుంటున్నాయి.అప్పుడే తీసుకొచ్చినట్లుగా తాజాగా మారిపోతున్నాయి.
ఈ వీడియోను అమిత్ తధాని అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ‘రెండు నిమిషాల నిజ జీవిత భయానక కథ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన జనం కూడా నిజంగా భయానకమని కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో ఆ కెమికల్స్ తో ప్రమాదమేమీ లేదని చెబుతున్నారు.
మరికొందరేమో..రసాయనాలతో ఆరోగ్యానికి ముప్పు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ వీడియో చూశాక..మళ్ళీ ఆకుకూరలు కొనడం ఎలా’ అంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు. ఈ వీడియో మీరూ చూడండి మరి!!
A two minute real life horror story. 😱 pic.twitter.com/gngzaTT56q
— Amit Thadhani (@amitsurg) March 17, 2023