• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » జీ 20 అధ్యక్ష బాధ్యత .. ఇండియాకు గర్వ కారణమన్న మోడీ

జీ 20 అధ్యక్ష బాధ్యత .. ఇండియాకు గర్వ కారణమన్న మోడీ

Last Updated: November 27, 2022 at 3:33 pm

జీ 20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇండియాకు గర్వ కారణమని, ఇది మనకు లభించిన మహదావకాశమని ప్రధాని మోడీ అన్నారు. ‘అమృత్ కాల్’ కింద భారత దేశానికి దక్కిన ఈ అపూర్వ అవకాశం తమకెంతో గర్వంగా భావిస్తున్నామని దేశవ్యాప్తంగా ప్రజలు తనకు లేఖలు రాశారని ఆయన తెలిపారు. జీ 20 ప్రెసిడెన్సీ బాధ్యతల నేపథ్యంలో ప్రపంచానికి మంచి జరిగేందుకు, శాంతి, సమైక్యత, అభివృద్ధి అన్న అంశాలపై దృష్టి పెట్టేందుకు మనం కృషి చేయాల్సి ఉందన్నారు. వీటికి సంబంధించి ఎదురవుతున్న సవాళ్లకు ఇండియా వద్ద పరిష్కారం ఉందన్నారు.

G20 presidency an opportunity for us: : PM Modi during Mann ki Baat - India Today

ఆదివారం తన 95 వ దఫా ..’మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో మోడీ.. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిష్యత్తు అన్న థీమ్ ని పదేపదే ప్రస్తావించారు. డిసెంబరు 1 నుంచి ఇండియా.. జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది. ఈ కారణంగా ఆయన ప్రధానంగా ఈ అంశాన్ని తన ప్రసంగంలో పేర్కొంటూ.. ఈ అవకాశాన్ని మన దేశం సమర్థంగా వినియోగించుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో విజయాలను కూడా ఆయన గుర్తు చేశారు. ..

అంతరిక్షంలోకి విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం ఈ రంగంలో దేశం సాధించిన అద్భుత ఘట్టంగా అభివర్ణించారు. ప్రైవేటు రంగంలో ఈ రాకెట్ ని డిజైన్ చేసి అభివృద్ధి పరిచారని, ఇందులో ఎన్నో కొత్త వ్యవస్థలు ఉన్నాయని మోడీ చెప్పారు. స్పేస్ సెక్టార్ (రంగం) లో సాధిస్తున్న విజయాలను ఇండియా తన పొరుగుదేశాలతో షేర్ చేసుకుంటున్నదని, సముద్ర వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని ని ఇండియా, భూటాన్ సంయుక్తంగా అభివృద్ధి పరిచాయని మోడీ పేర్కొన్నారు. భారత.భూటాన్ దేశాల మధ్య సత్సంబంధాలకు ఇది ఉదాహరణ అన్నారు. యువతకు ఆకాశమే హద్దు కాదని, వీరు ఎన్నో విజయాలు సాధిస్తారన్న విశ్వాసం తనకు ఉందని ఆయన చెప్పారు.

తన మన్ కీ బాత్ ప్రసంగంలో మోడీ.. జీ-20 సమ్మిట్ లోగోకి సంబంధించిన నేతనేసి తనకు బహుమతిగా ఇచ్చిన తెలంగాణ వాసిని ప్రశంసించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వెల్ది హరిప్రసాద్ అనే చేనేత కార్మికుడు తనకు ఈ అద్భుతమైన గిఫ్ట్ ని పంపారని ఆయన తెలిపారు. దీన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఇది ‘ఎమేజింగ్ గిఫ్ట్’ అని అభివర్ణించారు. హరిప్రసాద్ వంటి అనేకమంది జీ-20 ప్రెసిడెన్సీ ని ఇండియా చేబట్టడం తమకు గర్వకారణమంటూ తనకు లేఖలు రాశారన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

బీఆర్ఎస్ మహారాష్ట్ర బహిరంగ సభ షెడ్యూల్ ఇదే..!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.. కానీ కండీషన్స్ అప్లై

‘యువగళం’ యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఎన్టీఆర్..!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు… శరత్ చంద్రా రెడ్డికి బెయిల్ మంజూరు…!

మొదలైన ”యువగళం” పాదయాత్ర!

రెడ్ జోన్లో అదానీ కంపెనీ షేర్లు..!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

ఇలాంటి పుత్రుడు సమాజానికి అవసరమా?

అదానీ గ్రూప్ పై హిండెన్ బెర్గ్ రిపోర్ట్.. కాంగ్రెస్ డిమాండ్

ఫిల్మ్ నగర్

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

వరంగల్ లో వీరయ్య విజయ విహారం

వరంగల్ లో వీరయ్య విజయ విహారం

ఆలనాటి సత్యభామ ఇక లేరు!

ఆలనాటి సత్యభామ ఇక లేరు!

గ్రాండ్ గా వెంకీ సినిమా ఓపెనింగ్

గ్రాండ్ గా వెంకీ సినిమా ఓపెనింగ్

ఎట్టకేలకు స్పందించిన బాలయ్య..!

ఎట్టకేలకు స్పందించిన బాలయ్య..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap