దొరల రాజ్యాంగం తీసుకురావడానికే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాన్నారని మందకృష్ణ మాదిగ అన్నారు. అంబేడ్కర్ ను అవమానించిన కేసీఆర్.. ముక్కు నేలకు రాసి భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. రాజ్యాంగంపై భిన్న అభిప్రాయాలు ఉండచ్చు.. కానీ రాజ్యాంగాన్ని మార్చాలనడం దూరహంకారానికి నిదర్శనమని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నచ్చని కేసీఆర్.. ఆయన 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. రాజ్యాంగం వద్దన్నా కేసీఆర్ కు.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు లేదన్నారు.
శనివారం జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. చిన్నజీయర్ స్వామి రూపంలో సమాజంలో సాంఘిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. రామానుజచార్యుల విగ్రహ ఆవిష్కరణ తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. 1000 ఏండ్ల క్రితం రామానుజచార్యులు సమానత్వం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. దళితులను, బడుగులను చేరదిసాడు కాబట్టే.. రామానుజచార్యులు సమతా మూర్తి అయ్యాడని కొనియాడారు.
కానీ.. చిన జీయర్ స్వామి రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలను దగ్గరకు తీస్తున్నాడని ఆరోపించారు. చిన్నజీయర్ స్వామి పారిశ్రామిక వేత్తలతో వ్యాపారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆయన రామానుజల వారి నిజమైన శిష్యుడు కాదన్నారు. కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేస్తే.. చిన్న జీయర్ స్వామి సమానత్వ స్ఫూర్తిని పక్కన బెట్టాడని విమర్శించారు.
దళిత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో కాకుండా మోడీతో విగ్రహ ఆవిష్కరణ చేయించాడం దుర్మార్టం అన్నారు. సమానత్వం పాటించని చిన్నజీయర్ స్వామి సమతా మూర్తి విగ్రహం ఏర్పాటు చేశాడమేందని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని దళిత, గిరిజన, బడుగు బలహీన సబ్బండ వర్ణాలతో తాము నిర్మించుకుంటామని స్పష్టం చేశారు.