• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » రైతులతో కలిసి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం….!

రైతులతో కలిసి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం….!

Last Updated: January 19, 2023 at 9:03 pm

మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల వల్ల యేటా 700 ఎకరాల్లో పంట ముంపునకు గురవుతోందని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల వల్ల ముంపు గ్రామాల రైతులు భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ…. గత మూడేండ్లుగా 700 ఎకరాల్లో రైతులు పంట పండించుకోలేక పోతున్నారన్నారు.

ప్రాజెక్టులోకి నీరు రాగానే పంట అంతా నీటి పాలు అవుతోందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎన్ని సార్లు తీసుకు వెళ్లినా పట్టించుకోవడంలేదన్నారు. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ఈ ప్రాంత రైతుల పట్ల మాత్రం వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ప్రాంత రైతాంగ సమస్యలపై శాసన సభలో పలు మార్లు అడిగినప్పటికీ హామీలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. కానీ వాటిని అమలు మాత్రం చేయడం లేదని విమర్శించారు. ఇక్కడి నుంచి వచ్చే ఆదాయంతో సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

కానీ ఇక్కడి రైతుల కష్టాలను మాత్రం వారు అర్థం చేసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. రాబోయే నెల రోజుల్లోగా రైతులకు నష్ట పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కార్ ఓడిపోవడం ఖాయమన్నారు.

 

 

Primary Sidebar

తాజా వార్తలు

మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు షాక్.,.. !

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం…!

రాహుల్‌ను కాపీ కొట్టిన మాజీ ముఖ్యమంత్రి….!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

సాహితీ ఇన్ ఫ్రా మోసాలన్నింటిని ఒకే కేసుగా పరిగణించండి..!

పోలీసుల నోటీసులకు బండి భగీరథ్ రిప్లై…!

కేసీఆర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..!

ముగిసిన జమున అంత్యక్రియలు

అందుకే తేజస్వీ యాదవ్‌ను సీఎంగా నితీశ్ ఎంచుకున్నారు…!

ఖమ్మం కయ్యం.. కౌంటర్ ఎటాక్స్ తో హీట్ 

అలాంటి నిర్బంధ చదువులు మనకెందుకు….!

ఫిల్మ్ నగర్

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

ముగిసిన జమున అంత్యక్రియలు

ముగిసిన జమున అంత్యక్రియలు

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap