బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్టు కమిటీ లేఖ విడుదల చేసింది. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో లేఖ విడుదల అయింది. కేంద్ర కమిటీ సభ్యుడి హిడ్మా చనిపోలేదని ఆ లేఖలో వెల్లడించింది. హిడ్మా సేఫ్ గా ఉన్నాడని.. చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు.
దక్షిణ బస్తార్ లోని జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్, డ్రోన్ లు హెలికాఫ్టర్ ద్వారా దాడులు చేశారు. గత ఏడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేసినట్లు తెలిపారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వంను దెబ్బతియాలని వందల సంఖ్యలో బాంబులు పెల్చినట్లు లేఖలో వెల్లడించారు.
రాత్రి, పగలు లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు జరిగాయన్నారు.
ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రపంచంలోనే అన్ని ప్రగతిశీల కూటములు ఏకం కావాలి అంటూ మావోయిస్టు కమిటీ లేఖ విడుదల చేసింది.