స్మార్ట్ ఫోన్స్,ఇంటర్నెట్స్ సంసారాల్ని కూల్చడమే కాదు, వాటి ద్వారా పరిచయం అయ్యే బోగస్ యాప్స్ పలువురి ప్రాణాలు కూడా హరిస్తున్నాయి. మోసగాళ్ళు ఆకర్షణీయమైన పేర్లతో యాప్లు పెట్టి అమాయకుల్ని ట్రాప్లోకి దించి అప్పుల పాలు చేస్తున్నారు.
విజయవాడలో ఓవివాహిత భర్తకు తెలియకుండా 7 లక్షలు మోసపోయింది.ఇంట్లో వాళ్ళదగ్గర మొహం చెల్లక ఎటో వెళ్ళిపోయింది. ఇప్పటి వరకూ ఏమైందో కూడా తెలియరాలేదు. ఇంతకీ ఈమె చనిపోయిందా బతికే ఉందా..!? ఉంటే ఎక్కడ ఉంది! ఆమె మిస్సింగ్ మిస్టరీ వీడలేదు. వివరాల్లోకి వెళ్తే విజయవాడ సీతా రామపురంలో టెకీ హిమబిందు గత నెల 31న హిమబిందు అదృశ్యమైంది.
10రోజులు గడిచినా ఆచూకీ దొరకలేదు. ఇంతకీ ఏం జరిగింది…ఆమె అదృశ్యానికి దారితీసిన కారణాలేంటి అని ఆరా తీస్తే..బ్యాక్డ్రాప్లో ఒక మాయదారి యాప్ కనిపిస్తోంది. యాప్ నామధేయం వాషింగ్టన్ ఫిల్మ్ స్క్వేర్. పేరే వెరైటీగా ఉంది.
ఇది నకిలీ యాప్…మోసపోవద్దని ఓవైపు అనిపిస్తున్నా..దాని మాయలో పడిపోయింది హిమబిందు. విడతలు విడతలుగా 7 లక్షలు చెల్లించుకుంది. కంపెనీ నుంచి సడన్గా రియాక్షన్ ఆగిపోవడంతో.. మోసపోయినట్లు నిర్ధారించుకున్న హిమబిందు..మనస్తాపానికి గురై ఇంటి నుండి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
నకిలీ యాప్లో డబ్బులు పెట్టొద్దని భర్త నాగ కృష్ణ ప్రసాద్ చెప్పినా ససేమిరా అంటూ లక్షలాది రూపాయలు సమర్పించుకుంది.నిండా మునిగానని తెలుసుకుని…ఫ్యామిలీలో మొహం చూపించుకోలేక.. కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ హిమబిందు ఎక్కడైనా ప్రాణాలతోనే ఉందా లేక..బలవన్మరణానికి పాల్పడిందా అనేది మిస్టరీగా మారింది.
భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిసి ఫుటేజ్ పరిశీలించి హిమబిందు కదలికల్ని ట్రేస్ అవుట్ చేశారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని..ఆందోళన చెందుతున్నారు కుటుంబీకులు. ప్రస్తుతానికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.
హిమబిందు ఆచూకీ కోసం ట్రై చేస్తున్నారు పోలీసులు. పేరులోనే సినిమాటిక్ ఫ్లేవర్లున్న ఈ యాప్ గురించి కూడా లోతుగా ఆరా తీస్తున్నారు. ఆన్లైన్లో అమాయకుల్ని ఎలా ట్రాప్ చేస్తున్నారు. ఇంకా ఎంతమందిని మోసపుచ్చారన్న డీటెయిల్స్ కోసం సెర్చ్ జరుగుతోంది. అటు..హిమహిందు కుటుంబం మాత్రం తీవ్ర విషాదంలో ఉంది.
Also Read: వందేళ్ళ ప్రేమ లేఖ…ఇప్పటికీ పదిలంగా..!