ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు నటుడిగా అల్లు అర్జున్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది స్టార్స్ అల్లు అర్జున్ ను కలిసి ప్రత్యేకంగా విషెస్ తెలియజేస్తున్నారు. మొన్ననే డైరెక్టర్ హరీష్ శంకర్ అల్లు అర్జున్ ను కలిసి విష్ చేశారు.
కాగా తాజాగా డైరెక్టర్ మారుతి అల్లు అర్జున్ ని కలిశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. నా డియరెస్ట్ ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్ ఇప్పుడు ఒక ఐకాన్ గా మారడం చాలా ఆనందంగా ఉంది. పుష్ప ఈ సారి అన్ని అవార్డ్స్ ని కూడా స్వీప్ చేస్తుందని అనుకుంటున్నాను.
100 కోట్లతో బాలీవుడ్ డెబ్యూ బన్నీ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. బన్నీ హార్డ్ వర్క్ ప్యాషన్ తో మరింత సాధించి మమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు మారుతి.
ఇక సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 350 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ముఖ్యంగా హిందీలో వంద కోట్ల మార్కు ను అందుకుంది.
My dearest and oldest friend became Pan India icon now. So happy for his 100cr debut in Bollywood , wish powerhouse performance in #Pushpa will sweep all awards this time. His passion & hardwork will get many more achievements and make all of us proud ❤️@alluarjun #Thaggedhele pic.twitter.com/uLC6udZSGM
— Director Maruthi (@DirectorMaruthi) February 4, 2022