• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » భానుడి భగభగలు… వేసవి ముందే మొదలైందా…!

భానుడి భగభగలు… వేసవి ముందే మొదలైందా…!

Last Updated: February 18, 2023 at 10:44 am

భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. గతంతో పోలిస్తే ఈ నెలలో పలు రాష్ట్రాల్లో నమోదు కావాల్సిన దాని కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనీసం మార్చి కూడా ప్రారంభం కాక ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రధానంగా పంజాబ్‌లో గత వారంలో కనీసం ఒక రోజు సగటు గరిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా మార్చి మధ్యలో కనిపించే స్థాయికి చేరుకుంది. ఇక యూపీ, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఫిబ్రవరి చివరి వారాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు గత వారం నుంచే నమోదవుతున్నట్టు ఐఎండీ పేర్కొంది.

ఈ ఏడాది శీతాకాలంలో తగిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ముందస్తుగానే భానుడు మండిపోతున్నట్టు తెలిపింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రెండు వారాల్లో పలు రాష్ట్రాలపై ప్రభావం పడుతుందని వెల్లడించింది. ముఖ్యంగా ఇది గోధుమ పంటపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పింది. ఐఎండీ డేటా ప్రకారం…

ఫిబ్రవరి 16 నాటికి దేశ సరాసరి ఉష్ణోగ్రతలు 27.52 డిగ్రీ సెల్సియస్ గా ఉంది. 1981-2010 మధ్య ఈ వారం నాటికి సరాసరి ఉష్ణోగ్రత కన్నా 0.39 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. 1951 తర్వాత ఇది 23వ అత్యధిక ఉష్ణోగ్రత. గతేడాది ఈ సమయానికి సరాసరి ఉష్ణోగ్రతలు 25.4 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇది 1951 తర్వాత 50వ అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం.

దేశంలోని కొన్ని ప్రాంతాలు ముందస్తుగానే వేసవి ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో ఈ ఏడాది ఫిబ్రవరి 16తో ముగిసే సమయానికి 1951 నుంచి చూస్తే మొదటి, రెండవ, మూడవ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, ఒడిశా మిజోరంలలో ఇది 10వ అత్యధిక ఉష్ణోగ్రతలుగా ఉన్నాయి. పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులలో ఈ వారం ఉష్ణోగ్రతలను 1951 నుంచి చూస్తే 20 అత్యంత ఉష్ణోగ్రతలుగా ఉన్నాయి. ఫిబ్రవరిలోనే ఈ స్థాయిలో ఎండలు మండిపోతుండటంతో మార్చిలోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఎంపీ రాఘవ్,పరిణీతిల డేరింగ్ డేటింగ్ … !?

ముంబై ఎయిర్ పోర్ట్ లో న్యూలుక్ తో తళుక్కుమన్న ఐకానిక్ స్టార్..!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న వీరమల్లు …!

హోం వర్క్ చేయలేదని విద్యార్థిని కొట్టిచంపిన టీచర్…!

తమ్ముడి పెళ్లికి కలకాలం గుర్తుండి పోయేకానుకిచ్చిన అన్న…!

ఇప్పటి వరకు అనర్హత వేటు ఎదుర్కొన్నది వీళ్లే..!

ఎమ్మెల్సీ ఫలితాలు చూశాక సీఎం జగన్‌కు నిద్ర పట్టడం లేదు..!

నియంత నుంచి దేశాన్ని కాపాడుకోవాలి.. కేజ్రీవాల్

తప్పు చేశారు కాబట్టే రాహుల్ కి శిక్ష పడింది: డీకే అరుణ

రాహుల్ గాంధీ కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు… కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ట్వీట్..!

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

దేశంలో దొంగను దొంగా అని పిలవడం కూడా నేరంగా మారింది…!

ఫిల్మ్ నగర్

ఎంపీ రాఘవ్,పరిణీతిల  డేరింగ్ డేటింగ్ ... !?

ఎంపీ రాఘవ్,పరిణీతిల డేరింగ్ డేటింగ్ … !?

ముంబై ఎయిర్ పోర్ట్ లో న్యూలుక్ తో తళుక్కుమన్న ఐకానిక్ స్టార్..!

ముంబై ఎయిర్ పోర్ట్ లో న్యూలుక్ తో తళుక్కుమన్న ఐకానిక్ స్టార్..!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న వీరమల్లు ...!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న వీరమల్లు …!

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

నరేష్,పవిత్రలది సినిమా పెళ్లంట..పోస్టర్ అదిగో...!

నరేష్,పవిత్రలది సినిమా పెళ్లంట..పోస్టర్ అదిగో…!

ఎలిఫెంట్ విస్పర్ ఫిల్మ్ మేకర్స్ కి వెల్లువెత్తుతున్న అభిమానం...!

ఎలిఫెంట్ విస్పర్ ఫిల్మ్ మేకర్స్ కి వెల్లువెత్తుతున్న అభిమానం…!

mohan babu anger on manchu vishnu and manoj issue

కొడుకుల గొడవ పై మోహన్‌ బాబు సీరియస్‌!

manchu manoj slams brothe vishnu behaviour

మరోసారి తెరమీదకు  మంచు బ్రదర్స్‌ గొడవ!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap