• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

కరోనా క్రిటికల్ మీడియా

Published on : May 9, 2020 at 12:57 pm

నర్సింహ రెడ్డి, జర్నలిస్ట్

కరోనా తీవ్రత మీడియాను రోగగ్రస్తం చేసింది. తెలుగు మీడియా పరిస్థితి ఏమిటో ఒక సారి చూద్దాం..

దినపత్రికలు.

ప్రతి సంవత్సరం 150 కోట్ల లాభాలను అధినేత రామోజీరావుకు అందజేసిన ఈనాడు నష్టాల్లో మునిగింది. 18 లక్షల సర్క్యులేషన్ 6 లక్షలకు పడిపోయింది. ఈ 6 లక్షల కాపీలతో నెలకు 25 కోట్ల నష్టం. మరో పక్క ఫిలింసిటీ లో షూటింగ్ లు ఆగిపోయి టూరిస్టులు రాక మరోనష్టం. దీంతో ఉద్యోగులకు కత్తెర తప్పదని యాజమాన్యం చెప్తుంది. కరోనా తగ్గిన తరువాత కూడా న్యూస్ పేపర్ కొని చదివే అలవాటు పోతుంది కాబట్టి తెలుగు దినపత్రిక ఈనాడు పరిమితంగా ప్రజలకు అందుతుంది.

ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక సర్క్యులేషన్ ను బాగా తగ్గించుకుంది. ఎన్ని కాపీలు ముద్రిస్తే అంత నష్టం మరి. ఇక్కడ జర్నలిస్ట్ లు కూడా ఎప్పుడు వేటు పడుతుందో అని భయపడుతున్నారు.

కరోనా వ్యాధి సమయంలో ఫైవ్ స్టార్ క్వారంటైన్ ను ఎంజాయ్ చేస్తున్న దిన పత్రికలు సాక్షి, నమస్తే తెలంగాణ. సర్కూలేషన్ ను బాగా తగ్గించుకున్నప్పటికి ఆర్థిక వనరులకేం కొదవ లేదు. ప్రజాధనాన్ని , అడ్వర్టైజ్మెంట్ ల రూపంలో మింగుతున్న ఈ రెండు దినపత్రికలు భజన పరుల వేదికగా, రాజకీయ పునరావాస కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. ఇన్ని కోట్ల ప్రజాధనాన్ని మిడియాలోకి మళ్లించడం ప్రజాస్వామ్యం కాకపోయినా ఇది నడుస్తున్న చరిత్ర. సాక్షి దినపత్రికకు నెలకు 10 కోట్ల ప్రజాధనం మళ్లిస్తున్నారని ఆ పత్రిక ఉద్యోగి నాతో వాపోయారు.

టీవి మీడియా

పత్రికలు పెట్టుబడికి, కట్టుక థకు పుట్టిన విషపత్రికలు అని ఒక పెద్దమనిషి గతం లో అన్నారు. న్యూస్ టెలివిజన్ నేనేమాత్రం తీసిపోను అని నిరూపించింది. అన్ని టీవీ చానల్స్ తమకు భజన చేయడం చూసి పాలకులకు, పెట్టుబడి దారులకు వెగటు పుట్టింది. కొన్ని చానల్స్ ను మూస్తే పోలా అని వాళ్ళు భావించారు. ఆ మధ్య ఓ పెద్దాయన మీటింగ్ పెట్టి తాను టెలివిజన్ రంగం లోకి వచ్చిన కారణాలను వివరించారు. 80 వేల కోట్ల ఆస్తులను ఏంచేసుకోవాలో తెలియడం లేదని, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకుండా మీడియాను కొంటానని చెప్పారు. అయితే కొన్ని నెలల్లోనే ఖర్చు ఎక్కువ అని చెప్పి 250 మంది జర్నలిస్ట్ లను ఉద్యోగాలు పీకి రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు మరో ఛానల్ మూసెయ్యడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. లెక్కలేనంత డబ్బు ఉందని ప్రగల్భాలు పలికిన న్యూస్ టెలివిజన్ ఓనర్లు కరోనా సాకుతో జర్నలిస్టుల పొట్టమీద కొట్టడానికి సిద్ధం అవుతున్నారు.

కరోనా వల్ల వచ్చిన రెండు నెలల నష్టానికీ విలవిలాడుతున్న యజమానులు ఇప్పటిదాకా మీడియాను అడ్డం పెట్టుకొని సంపాదించిన వేలు, వందల కోట్లు ఎక్కడ దాచారు? ఇప్పటి దాకా తమ చెమటను ధారపోసిన జర్నలిస్ట్ లను వేస్ట్ పేపర్లు గా ఎందుకు మారుస్తున్నారు?

నేను నెపం జర్నలిస్ట్ లమీదే వేస్తాను. అవును వాళ్లే ఈ పరిస్థితికి కారణం. వెన్నెముక లేని వాళ్ళను, లక్ష, రెండు లక్షల జీతానికి మొత్తం సంక్షేమాన్ని తాకట్టు పెట్టేవారిని జర్నలిస్ట్ నాయకులుగా ఎన్నుకోవడమే మనం చేసిన తప్పు. ఈ నీచులను, పాలకుల బూట్లు నాకే గూట్లే గాళ్లను నాయకులను చేయడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం.నా యువ జర్నలిస్ట్ మిత్రుల నుంచి ఆత్మను అమ్ముకోని నాయకత్వం పుడుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. కొత్త నాయకత్వంలో మీడియా ప్రజల పక్షాన నిలుస్తుందని పాలకుల్ని, పెట్టుబడి విషనాగుల్ని ఎదిరిస్తుందని నా నమ్మకం.

tolivelugu app download

Filed Under: చెప్పండి బాస్..

Primary Sidebar

ఫిల్మ్ నగర్

తక్కువ ధరకే కార్లు... యంగ్ హీరోపై కేసు నమోదు

తక్కువ ధరకే కార్లు… యంగ్ హీరోపై కేసు నమోదు

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

కాళేశ్వ‌రం టూర్.. క్యా మ‌త్‌ల‌బ్?

కాళేశ్వ‌రం టూర్.. క్యా మ‌త్‌ల‌బ్?

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే...

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే…

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

high tension at huzur nagar

ధాన్యం కొనుగోలు చెయ్యనప్పుడు ప్రభుత్వం ఎందుకు ?

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)