• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

మెఘా తలరాతను మార్చిన కాళేశ్వరం

Published on : October 12, 2019 at 12:29 pm

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తెలంగాణ రైతంగానికి రెండు పూటల తిండి పెట్టింది లేదు. అదనంగా ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు తెలంగాణ బీడు భూములకు పారిందీ లేదు. కానీ… ప్రాజెక్ట్‌ కట్టిన కాంట్రాక్టర్‌ మెఘాను మాత్రం అపర కుభేరున్ని చేసింది. ఒకే ఒక్క ప్రాజెక్ట్‌ మెఘా తలరాతను బంగారంలా మార్చేసింది.

అవును.. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన రీడిజైనింగ్‌ మెఘా సంస్థకు కాసుల పంట పండించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలక పనులు చేసిన మెఘా సంస్థ దేశంలోని ధనవంతుల జాబితాలో మరింత ముందుకు దూసుకొచ్చింది. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యజమాని 47 వ స్థానం నుండి 39 వ స్థానానికి చేరుకోవటం గమనార్హం. అంటే ఒకే ఒక్క ప్రాజెక్ట్‌ వల్ల 8 స్థానాలు ఎగబాకరన్నమాట.

కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే తెలంగాణ ప్రజలకు టక్కున గుర్తొచ్చేది మెఘా కృష్ణా రెడ్డి. 34 వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి . కాంట్రాక్టర్ మెఘా కృష్ణా రెడ్డి ప్రభుత్వ పెద్దలు పంచుకు తిన్నారని విపక్షాలు , సాగునీటి ప్రాజెక్ట్ ల నిపుణులు ముందు నుంచి విమర్శిస్తున్నారు . కావాలనే రీడిజైనింగ్ పేరుతో మెఘాకు ప్రాజెక్ట్ కట్టబెట్టి వేల కోట్లు కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయ్. ఇప్పుడు ఫోర్బ్స్ విశ్లేషణ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి వాస్తవమనే టాక్ నడుస్తోంది. ఒక్క సాగునీటి ప్రాజెక్టు తో దేశ ధనవంతుల జాబితాలోముందు కు వెళ్లడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాలో ఇప్పుడు ఇదో పెద్ద చర్చ. తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో , వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన మెఘా కృష్ణా రెడ్డి బాగోతం బయట పడాల్సిందే అని రాష్ట్ర ప్రజలు చర్చిందుకుంటున్నారు .ఐటి రైడ్స్ లో అవినీతి సొమ్మంతా బయటపడాలని కోరుకుంటున్నారు.

ఒక్క కాళేశ్వరంతోనే టాప్‌ 50లోకి వచ్చేస్తే… పోలవరం ప్రాజెక్ట్, తెలంగాణ-ఆంద్రా ప్రాంత ముఖ్యమంత్రులు చేస్తోన్న గోదావరి-కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌ కూడా మెఘానే చేస్తే టాప్‌10లోకి రావటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

tolivelugu app download

Filed Under: బిగ్ స్టోరీ

Primary Sidebar

ఫిల్మ్ నగర్

తెర‌పైకి మ‌నం-2?

తెర‌పైకి మ‌నం-2?

(no title)

సలార్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది

సలార్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది

ఆచార్య టీజ‌ర్ అప్డేట్-వీడియో

ఆచార్య టీజ‌ర్ అప్డేట్-వీడియో

మారిన మాస్ట‌ర్ మూవీ డిజిట‌ల్ రిలీజ్ డేట్

మారిన మాస్ట‌ర్ మూవీ డిజిట‌ల్ రిలీజ్ డేట్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

పీఆర్సీ లీక్ పై స‌ర్కార్ సీరియ‌స్

పీఆర్సీ లీక్ పై స‌ర్కార్ సీరియ‌స్

తెగని ఏపీ పంచాయతీ..ఇంకా ఉంది!

తెగని ఏపీ పంచాయతీ..ఇంకా ఉంది!

మదనపల్లి హత్యలు..ఆ ఇద్దరు ఎవరు?

మదనపల్లి హత్యలు..ఆ ఇద్దరు ఎవరు?

ఎర్రకోటను పరిశీలించిన కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి

ఎర్రకోటను పరిశీలించిన కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి

హైదరాబాద్ లో కొత్త స్ట్రెయిన్ కలకలం- ఆ 15మందిలో....

హైదరాబాద్ లో కొత్త స్ట్రెయిన్ కలకలం- ఆ 15మందిలో….

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల‌పై రంగంలోకి గ‌వ‌ర్న‌ర్

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల‌పై రంగంలోకి గ‌వ‌ర్న‌ర్

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)