• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » కంటి వెలుగు కార్యక్రమం గొప్పది: హరీశ్‌ రావు!

కంటి వెలుగు కార్యక్రమం గొప్పది: హరీశ్‌ రావు!

Last Updated: February 23, 2023 at 4:10 pm

అంధత్వం నుంచి విముక్తి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన కంటి వెలుగు చాలా అద్భుతంగా కొనసాగుతోందని ఆయన కొనియడారు. తెలంగాణ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కంటి వెలుగు కేంద్రాన్ని ఆయన సందర్శించడం జరిగింది.

ఆ తరువాత అక్కడ ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఇక తెలంగాణ ప్రజలెవరూ కూడా కంటిచూపు సమస్యలతో బాధపడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. పండుగ వాతావరణం నేపథ్యంలో గురువారం ఏకంగా 50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.అలాగే ప్రభుత్వ పథకాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గడిచిన 25 రోజుల్లో మొత్తం పరీక్షల సంఖ్య 50 లక్షల మార్కుకు చేరుకుంది. 25 రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఉచితంగా కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు నిర్వహించి, మందులు ఇంకా అవసరం అయిన వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నదని ఆయన అన్నారు.

ఇక అంతేగాక ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమంగా రికార్డు సృష్టించేందుకు కృషి చేస్తున్నామని కూడా మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న 50 లక్షల పరీక్షల్లో మొత్తం 16 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తేలిందని మంత్రి వెల్లడించారు. మొత్తం 9,35,512 మందికి అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, అందులో 6,49,507 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం రిఫర్ చేయగా, 54,324 మందికి ఇంటి వద్ద పంపిణీ చేశారని మంత్రి తెలిపారు.

Primary Sidebar

తాజా వార్తలు

విమోచనం మంటలు.. అమిత్ షా కు కేటీఆర్ కౌంటర్

పుదుచ్చేరిలో బీజేపీ నేత దారుణ హత్య

నిద్రలేమితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే!

వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!

అమెరికాకు మరో హెచ్చరిక..నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం!

తృణమూల్ కాంగ్రెస్ షాకింగ్ నిర్ణయం

‘బీజేపీకి జై కొట్టకపోతే.. జైలుకు పోతావ్’.. ప్రతిపక్షాలకు బెదిరింపులు

ఎంపీ, ఎమ్మెల్యేలతో వేదిక పంచుకున్న అత్యాచార నిందితుడు..మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత!

పార్లమెంట్ లో రాహుల్ ‘సునామీ’ !

నాన్న రామ్ చరణ్ నిన్ను చూసి గర్విస్తున్నాను!

సుశాంత్ సింగ్ స్మృతుల్లో స్మృతి.. కంటతడి

ఏప్రిల్‌ 8న హైదరాబాద్‌కు మోడీ!

ఫిల్మ్ నగర్

chiranjivi birthday wishes to ram charan

నాన్న రామ్ చరణ్ నిన్ను చూసి గర్విస్తున్నాను!

ramcharan rc15 movie title announced as game changer

గేమ్‌ ఛేంజర్‌గా వస్తున్న చరణ్‌!

malayalam actor former loksabha mp innocent passed away

ప్రముఖ నటుడి కన్నుమూత!

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

Bhojpuri actress Akanksha Dubey 'dies by suicide' in Varanasi hotel - The  Economic Times

వారణాసిలో భోజ్ పురి నటి ఆత్మహత్య

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap