ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. దేశంలో అమలు అవుతున్నది డెమోక్రసీ కాదని, ఇది మోడీ మార్కు డెమోక్రసీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం చర్య సిగ్గుచేటు అంటూ కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. యావత్తు దేశాన్ని ఒకే దృష్టితో చూడాల్సిన ప్రధాని మోడీ.. అందుకు విరుద్ధంగా తన సొంత రాష్ట్రం గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని విస్మరించారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగిస్తోందని, సవతి తల్లి ప్రేమ చూపుతోందని మరోసారి రుజువైందని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం.. యథావిధిగా గుజరాత్కు తరలిపోయిందని మండిపడ్డారు. వరంగల్కు కేంద్రం ప్రకటించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటికీ రాకపోగా.. గుజరాత్కు మాత్రం ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ ప్రాజెక్టును ప్రకటిస్తూ కేంద్రం ఇటీవలే కీలక ప్రకటన చేసింది.
ఈ ప్రకటనపై తెలంగాణకు చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. దానిని ఉదహరిస్తూ మోడీపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఆఫ్ గుజరాత్, బై గుజరాత్, ఫర్ గుజరాత్, టూ గుజరాత్ అన్న సూత్రంతోనే మోడీ పనిచేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా వరంగల్కు ఇస్తామన్న లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ హామీని మోడీ తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.
Of Gujarat, By Gujarat, For Gujarat & To Gujarat – New definition of Modemocracy
Despite promises made in Parliament, Warangal in Telangana is denied locomotive coach factory
Shame on you NPA Govt https://t.co/gqptAayT7H
— KTR (@KTRTRS) April 22, 2022
Advertisements