ఏపీ కొత్త మంత్రి వర్గం రూపుదిద్దుకుంది. పాత,కొత్త వారిని కలిపి 25 మందితో కూడిన నూతన మంత్రి వర్గాన్నిఏర్పాటు చేశారు సీఎం జగన్.వారితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే..ఈ సారికూడా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ప్రకటించగా..మరో సారి దళిత మహిళకు హోం మంత్రి పదవిని కట్టబెట్టారు.
రాజన్నదొర,బూడి ముత్యాలనాయుడు,అంజాద్ బాషా, కొట్టు సత్యనారాయణ,నారాయణస్వామి లను ఏపీ కొత్త కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటించారు సీఎం.దాంతో పాటు.. వివిధ శాఖలను అప్పగించారు జగన్. అత్యంత కీలకమైన హోంశాఖను దళిత మహిళ తానేటి వనితకు కేటాయించారు. రాజన్నదొరకు ఎస్టీ సంక్షేమ శాఖ, బూడి ముత్యాలనాయుడుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు..అంజాద్ బాషాకు మైనార్టీ సంక్షేమ శాఖ, కొట్టు సత్యనారాయణకు దేవాదాయ శాఖ, నారాయణస్వామికి ఎక్సైజ్ శాఖలను డిప్యూటీ సీఎం తో పాటు అదనపు బాధ్యతగా కేటాయించారు.
బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ,సీదిరి అప్పలరాజుకు పశుసంవర్ధక, మత్స్యశాఖలు..గుడివాడ అమర్నాథ్ కు పరిశ్రమలు, ఐటీ,పెట్టుబడులు,వాణిజ్య శాఖలను కేటాయించారు. దాడిశెట్టి రాజాకు రోడ్లు భవనాల శాఖ..పినిపే విశ్వరూప్కు రవాణా శాఖ.. చెల్లుబోయిన వేణుకు బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐఎన్పీఆర్ శాఖలను కేటాయించారు. జోగి రమేష్ కు గృహ నిర్మాణ శాఖ, విడదల రజినీకి వైద్య ఆరోగ్య శాఖ, అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ కేటాయించారు.
Advertisements
ఆదిమూలపు సురేష్ కు మున్సిపల్ శాఖను కేటాయించగా.. కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యుత్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖలు ఇచ్చారు. ఆర్కే రోజాకు టూరిజం, సాంస్కృతిక యువజన శాఖ.. బుగ్గన రాజేంద్రనాథ్ కు ఆర్థిక శాఖ.. గుమ్మనూరు జయరాంకు కార్మిక శాఖ.. ఉషాశ్రీచరణ్ కు మహిళా శిశు సంక్షేమ శాఖ.. ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ శాఖ కేటాయించారు.