యాదాద్రి జిల్లా ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటోలను కొండపైకి అనుమతించాలని బుధవారం ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసనకు దిగారు కార్మికులు. కొండపైకి నడిపించుకునే ఆటోలు బంద్ అయి ఇయ్యాళ్టితో 335 రోజులు పూర్తయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో ఈ విషయంపై గొంగిడి సునీత రియాక్ట్ అయ్యారు. ఆటో కార్మికులతో మాట్లాడుతూ.. ఈ విషయంలో తానేం చేయలేనని స్పష్టం చేశారు. నా వల్ల కాదని చేతులు ఎత్తేశారు. ఏదైనా ఉంటే వెళ్లి ఆలయ ఈవోని అడగండి అంతా ఆమె చేస్తుందని ఎమ్మెల్యే సూచించారు. భూపాల్ రెడ్డితో మాట్లాడినా ఈవో వినడం లేదన్నారు.
ఆఖరికి సీఎం దగ్గరికి వెళ్లి అడిగినా ప్రయోజనం లేదని చెప్పారు. మీరు ఆటోలు ఒక్కటే కాకుండా వేరే పనులు ఏవైనా చూసుకోవాలి అని పేర్కొన్నారు. ఈ విషయంలో తన వంతుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశానని.. ఇక తన వల్ల కాదని, తానేం చేయలేనని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే గొంగిడి సునీత.