జగ్గారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే
తలసాని నాకు కరోనా వస్తే గాంధీలో చేరుతా అంటున్నారు. మంత్రి కాబట్టి గాంధీలో చుట్టూ 50 మంది వైద్యులు ఉంటారు.సామాన్యుడికి కూడా అలాంటి వైద్యమే చేస్తారా..? మంత్రులు భజన మండలి మానుకోండి. కరోనా ని ఆరోగ్య శ్రీలో ఇప్పటికైనా చేర్చండి. త్వరలోనే దీక్ష చేస్తా.. దీక్ష చేసి వదిలేయను.
క్యాబినెట్ అంతా కరోనా కంటే..సెక్రటేరియట్ నిర్మాణం గురించే చర్చ కరోనాతో జనం చస్తుంటే.. చర్చించాల్సింది ఇదేనా..? 500 కోట్లు అవసరమా..? కరోనాకి 100 కోట్లు… సెక్రటేరియట్ కి 500 కోట్లా..?మానవత్వం లేని ప్రభుత్వం ఇది. సెక్రటేరియట్ మీద చూపించిన శ్రద్ధ..ఆసుపత్రుల మీద దృష్టి సారిస్తే బాగుంటుంది.