టీడీపీకి రాజీనామా చేసిన తరువాత తనపై ఆ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశాడు. అమ్మాయిలతో మార్ఫింగ్ ఫోటోలను జతచేసి తప్పుడు ప్రచారం చేస్తున్న అసలు దోషులను శిక్షించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కోరారు వంశీ. తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్ సైట్ల నుండి ఈ దుష్ప్రచారం జరుగుతోందనే ప్రాథమిక సమాచారాన్ని కమిషనర్ కు వంశీ అందజేశారు.
తనపై ఆరోపణలు విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల బతుకేంటో అందరికీ తెలుసునని..ఎన్నికల సమయాల్లో సూట్కేసులు కొట్టేసే వారు కూడా తనపై ఆరోపణలు చేస్తే వారి బండారం అంతా బయట పెడతానంటూ హెచ్చరించారు వంశీ.