దేశంలో సంచలనం సృష్టించిన బీర్భూమ్ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో రణరంగాన్ని తలపించింది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సభ్యలోనే వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. అది కాస్తా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఘర్షణ నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఇటీవల బీర్భూమ్ జిల్లాలో 8 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యే పట్టుబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతల వ్యాఖ్యలను తృణమూల్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి లేచి గొడవకు దిగారు.
ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ తిగ్గ బట్టలు చిరిగిపోగా.. టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందర్ ముక్కుకు గాయమైంది. సభలో జరిగిన రభస గురించి బీజేపీ నేతలు వీడియో షేర్ చేశారు. ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య, ప్రతినిధి షెహజాద్ జై హింద్ తో పాటు అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభలో అడ్డుకున్నారు. రెండు వర్గాల ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మార్షల్స్ ప్రయత్నించారు. ఇక తమ ఎమ్మెల్యేలపై దాడి చేశారని టీఎంసీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
ఈ ఘటనపై స్పీకర్ సీరియస్ అయ్యారు. సువేందుతో సహా ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. బీజేపీ నేత సువేందు తనను కొట్టినట్లు టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందార్ తెలిపారు. శాంతి భద్రతలపై స్టేట్ మెంట్ ఇవ్వమంటే.. సివిల్ డ్రెస్సులో వచ్చిన పోలీసులు తమపై దాడికి దిగారని సువేందు ఆరోపించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు భద్రత లేదని, 10 మంది ఎమ్మెల్యేలను కొట్టారని మండిపడ్డారు. అయితే.. టీఎంసీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అసెంబ్లీలో ఉద్రిక్తతలు సృష్టించేందుకే బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఆరోపించారు. కమలం పార్టీ నేతలే దాడి చేశారని, తమ ఎమ్మెల్యేలు కొంతమంది గాయపడ్డారని చెప్పారు.
Absolute pandemonium in the West Bengal Assembly. After Bengal Governor, TMC MLAs now assault BJP MLAs, including Chief Whip Manoj Tigga, as they were demanding a discussion on the Rampurhat massacre on the floor of the house.
What is Mamata Banerjee trying to hide? pic.twitter.com/umyJhp0jnE
— Amit Malviya (@amitmalviya) March 28, 2022
Advertisements