తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొత్తం ఆరు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 వరకు జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాలలో ఒక్కో స్థానానికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాల్లో ఎన్నిక జరుగుతుంది.
ఆరు స్థానాలకు గాను.. మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అటు, 5326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.