• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » ఇంటివద్దే క్రిమేషన్…ఓ కోపరేటివ్ సొసైటీ వినూత్న ఏర్పాటు..!

ఇంటివద్దే క్రిమేషన్…ఓ కోపరేటివ్ సొసైటీ వినూత్న ఏర్పాటు..!

Last Updated: January 22, 2023 at 4:12 pm

బతికున్నంత కాలం డబ్బు,సంపద, సంతానం మాత్రమే కాదు, చుట్టాల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్నీ పోగేసుకుంటాడు మనిషి.ఆయువు తీరాకా జీవి..నిర్జీవి. అందుకే అతను సంపాదించుకున్న నలుగురూ అంతిమ సంస్కారాలు చేసి ఘనంగా సాగనంపుతారు.

చావు కూడా పెళ్ళిలాంటిదే అన్నట్టుగా బతికున్నప్పుడు మనిషికి వసతులు, సౌకర్యాలు ఎంత ముఖ్యమో, తనువు చాలించాకా అంతిమ సంస్కార వసతి సైతం అంతే ముఖ్యం.

ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు స్మశానం లేక ఇబ్బంది పడ్డారు ఆ గ్రామస్థులు. అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం వల్ల విసిగిపోయారు. గ్రామస్థుల ఇబ్బందులను చూసిన ఓ సహకార సంఘం వినూత్నంగా ఆలోచింది.

దహన సంస్కారాలు నిర్వహించేందుకు సంచార స్మశానం ఏర్పాటు చేసింది. ఇప్పుడీ క్రిమేషన్ మెషీన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో జరిగింది .

బిందూర్ నియోజకవర్గం జడ్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని జడ్కల్, ముదురు గ్రామాల్లో స్మశానం వాటికలు లేవు. ఈ గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు.

స్మశానాలకు స్థలం లేకపోవడం వల్ల కుండాపుర్ అనే గ్రామానికి వెళ్లి దహన సంస్కారాలు చేయాల్సి వచ్చేది. 2021లో ఓ 50 ఏళ్ల వ్యక్తి చనిపోతే తమ ఇంటి పెరట్లోనే దహన సంస్కారాలు చేయాల్సి దుస్థితి ఏర్పడింది. దాని వల్ల పక్కనే ఉన్న కొబ్బరి తోటకు మంటలు అంటుకున్నాయి.

తమ గ్రామంలో స్మశానం నిర్మించాలని దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్ను అధికారులు పెడచెవిన పెట్టారు. అధికారుల తీరుతో గ్రామస్థులు విసుగెత్తిపోయారు. ఆ గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు ఓ వ్యవసాయ సహకారం సంఘం స్పందించింది.


వినూత్నంగా ఆలోచించి ఆ గ్రామంలో ఓ సంచార స్మశానాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి మెషీన్ కర్ణాటకలో ఇదే మొదటిదని సహకార సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా ఈ పరికరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ మెషీన్కు అయిన ఖర్చులు సహకార సంఘం ఫండ్ నుంచి వెచ్చించారు. దీంతో పాటు మెషీన్ను తరలించేందుకు ట్రాన్స్పోర్టు ఖర్చు, దహన సంస్కారాలు చేసేందుకు గ్యాస్ లేదా విద్యుత్ ఖర్చు కూడా సహకారం సంఘమే భరిస్తుంది.

పర్యావరణం హితమైన ఈ మెషీన్ దాదాపు 7 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉంటుంది. గ్యాస్, విద్యుత్తో పనిచేస్తుంది. విద్యుత్ లేనప్పుడు గ్యాస్తో కూడా నడుస్తోంది. మృతదేహాన్ని మెషీన్ చాంబర్లో ఉంచి కర్పూరంతో నిప్పు అంటించాలి.

టాప్ మూసేసి గ్యాస్ కనెక్ట్ చేయాలి. కొద్ది నిమిషాల్లో దహనం పూర్తి అయిపోతుంది. గ్యాస్, విద్యుత్తో పనిచేస్తుంది కాబట్టి వాయు కాలుష్యం కూడా ఉండదు. ఒక్కసారి దహనం చేయడానికి 10 కిలోల గ్యాస్, 100 గ్రాముల కర్పూరం అవసరమవుతుంది. ఈ మెషీన్ తయారు చేయడానికి రూ. 5.80 లక్షలు ఖర్చు అయినట్లు నిర్వాహకులు తెలిపారు.


దీన్ని కేరళకు చెందిన స్టార్ ఛైర్ కంపెనీ తయారు చేసింది. “ఈ సంచార స్మశానాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చు. కొంత మంది వారి ఇంటి వద్ద దహన సంస్కారాలు నిర్వహించాలనుకుంటారు. అలాంటప్పుడు ఈ మెషీన్ను సులభంగా చనిపోయిన వ్యక్తి ఇంటి వద్ద తీసుకెళ్లొచ్చు” అని ముదురు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు విజయ శాస్త్రి తెలిపారు

Primary Sidebar

తాజా వార్తలు

బోరుబావిలో పడిన చిన్నారి….కొనసాగుతున్న సహాయక చర్యలు…!

ఇది చాలా తీవ్రమైన ఘటన.. నన్ను ఎంతగానో కలిచివేసింది!

రైలు ప్రమాదంలో ఏపీ వాసులు చనిపోలేదు: మంత్రి బొత్స

రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోడీ…!

ఒడిశా రైలు ప్రమాదం.. రాజకీయాలకు ఇది సమయం కాదు: మమతా

ఒడిశా రైలు ప్రమాదానికి కారణం ఇదే… నిపుణుల నివేదికలో షాకింగ్ విషయాలు…!

వడ్డీ వస్తుందని డబ్బిస్తే…ఎప్పుడిచ్చావ్ అంటూ ప్లేటు ఫిరాయించింది..!

ఇప్పుడు దేశం చూపు తెలంగాణ వైపే!

చాలా చూశాం.. నోటీసులకు భయపడను: ఎమ్మెల్యే రఘునందన్ రావు

గోవా- ముంబై  వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం రద్దు!

కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది: వీహెచ్

ద్విచక్రవాహనంపై వచ్చి పట్టపగలే దోచుకుపోయారు..!

ఫిల్మ్ నగర్

తిరుపతిలో అంగరంగ వైభవంగా ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్...!?

తిరుపతిలో అంగరంగ వైభవంగా ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్…!?

celebreties react on coromandel express train accident incident

ఘోరంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Narasimha Naidu re release

బాలయ్య నుంచి మరో సినిమా రీ-రిలీజ్

PS2 free for prime subscribers

పొన్నియన్ సెల్వన్ 2.. ఇకపై ఉచితం

Who is the father of Ileana's unborn child

ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు?

Boyapati takes 24 days for action sequence

సింగిల్ సీక్వెన్స్ కి 24 రోజులు షూటింగ్

naga chaitanya to do his next with chandu mondeti

హిట్‌ కొట్టాలంటే ఆయనతోనే చేయాలి!

Adipurush countdown starts

ఆదిపురుష్.. కౌంట్ డౌన్ షురూ

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap