బీహార్ లో ఓ దొంగల ముఠా పట్టపగలే సెల్ ఫోన్ టవర్ ను చోరీ చేసింది. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అధికారులుగా నటించి.. సెల్ టవర్ ను దొంగిలించారు. కంపెనీ నష్టాల్లో ఉందని టవర్ తీసివేస్తున్నట్లు.. స్థల యజమానిని నమ్మించి దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే బీహార్ లోని పాట్నా గార్డెన్ బాగ్ లోని కచ్చి తలాబ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ కు కొన్ని నెలలుగా ఆ కంపెనీ వారు అద్దె చెల్లించడం లేదు. అయితే ఈ విషయం పసిగట్టిన ఓ దొంగల ముఠా ఇదే అదునుగా బాధించింది. 10-15 మందితో వెళ్లి టవర్ ను దొంగలించడానికి ప్లాన్ వేసింది. ఆ తర్వాత టవర్ ఏర్పాటు చేసిన స్థల యజమానితో.. తాము ప్రొవైడర్ అధికారులమని చెప్పారు.
కంపెనీ నష్టాల్లో ఉన్నందున అద్దె చెల్లించలేమని తెలిపారు. అందుకే టవర్ ను తొలగించాలనుకుంటున్నట్లు చెప్పగా దానికి స్థల యజమాని అంగీకరించాడు. దీంతో ఆ ముఠా వెంటనే టవర్ ను నేలమట్టం చేసింది. అనంతరం టవర్ భాగాలను అక్కడ నుంచి ఎత్తుకెళ్లింది. దీంతో ఈ విషయం కాస్తా స్థానికంగా సంచలనంగా మారింది. ఇది తెలుసుకున్న గ్రామస్థులు ఒకింగ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కాగా మరో వైపు రాజస్థాన్ లో అమెరికా ప్రజలను మోసం చేస్తున్న ఓ నకిలీ కాల్ సెంటర్ పై పోలీసులు దాడులు చేశారు. చిత్తోర్ గఢ్ లోని ఓ హోటల్ లో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారంతో రైడ్ నిర్వహించారు పోలీసులు. ఈ దాడుల్లో 16 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అమెజాన్ పేరుతో ఆమెరికాలోని ప్రజలను మోసగిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి కీలక పత్రాలు, కంప్యూటర్ లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేసినట్లు చిత్తోర గఢ్ స్టేషన్ ఇన్ ఛార్జ్ విక్రమ్ సింగ్ తెలిపారు.