గో రక్షకులు అనే ముసుగులో ప్రజలను చంపి, దోపిడీకి పాల్పడుతున్న వారిని బీజేపీ ప్రోత్సహిస్తోందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. హర్యానాలోని భివానీ జిల్లాలో జునైద్, నసీర్ ల హత్య ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
అయితే భివానీ జిల్లా బార్వాన్ గ్రామంలో కాలిపోయిన ఓ బొలేరే వాహనంలో రెండు మగ అస్థిపంజరాలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. చనిపోయిన వ్యక్తులు రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాకు చెందిన జునైద్, నసీర్ లుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరి హత్య వెనుక గో రక్షకుల హస్తం ఉందని ఒవైసీ ఆరోపించారు.
ఈ దారుణాన్ని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం వెనుకేసుకొస్తుందని.. ఈ ఘటనపై ప్రధాని మోడీ, అమిత్ షా లు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. గో రక్షకులు అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారని వీరికి బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ అండ ఉందని ఆరోపించారు. ఇలాంటి వారిని బీజేపీ ప్రోత్సహించడం మానేయాలన్నారు. హర్యానాలో శాంతిభద్రతలు గాల్లో కలిశాయని విమర్శించారు ఒవైసీ.