మహిళా బిల్లుపై మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించారని.. కానీ అవి అమలు కావడం లేదన్నారు.
ప్రధాని మోడీని ఎవరు ప్రశ్నించినా ఇదే తరహా దాడులు జరుగుతాయన్నారు. మొదటగా వ్యాపార సంస్థలపై టార్గెట్ చేశారని, ఆ తర్వాత వాటిని నియంత్రించాలని చూస్తున్నారని ఆరోపించారు కవిత.
రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే దాకా పోరాటం చేస్తామన్నారు. కేంద్రంలోనూ బీజేపీ సర్కార్ ఫెయిలైందన్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ కూడా కలిసిరావాలని కోరినట్టు తెలిపారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత.
అంతకుముందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణపై తాత్కాలిక స్టే ఇవ్వాలని ఆమె పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కవిత మార్చి 16న విచారణకు హాజరుకానున్నారు.