మోడీ సర్కార్ కుటిల నీతికి పాల్పడుతోందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల భారాన్ని ప్రతి యేటా ప్రజలపై మోపబోతున్నారని ఆయన మండిపడ్డారు. యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు వసూలు చేయబోతున్నట్టు వస్తున్న వార్తలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాదర్శక చెల్లింపుల పేరుతో ప్రజలను ఆన్ లైన్ చెల్లింపుల వైపు మళ్లించారన్నారు. ఇప్పుడు ఆ చెల్లింపుల పై 1.1 శాతం ఛార్జ్ వసూలు చేయడం మోడీ కుటిల నీతికి అద్దం పడుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ హఠావో..దేశ్ బచావో అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్ పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూపీఐ ద్వారా నిర్వహించే వ్యాపార లావాదేవీలపై 1.1 శాతం ఛార్జీ వసూలు చేసుకునే వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేష్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది.
ఎన్ పీసీఐ సర్క్యులర్ లో ఏప్రిల్ 1 నుంచి యూపీఐలో రెండు వేల కంటే ఎక్కువ మర్చంట్ లావాదేవీలపై 1.1 పీపీఐ ఛార్జీలు వర్తింపజేయాలని సిఫార్సు చేసింది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల పై ప్రతి ఏటా వేల కోట్ల అదనపు భారం పడుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. మోడీ సర్కార్ ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.