భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారికంగా పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది పీఎంవో.
గురువారం ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఎయిర్ పోర్టులో కు చేరుకోనున్నారు. ఆ తర్వాత 1.45 వరకు ఎయిర్ పోర్టు పార్కింగ్ లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. 1.50కి హెలికాప్టర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ హెలిప్యాడ్ కు వెళ్తారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన గచ్చిబౌలి ఐఎస్బీకి చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటల నుండి 3.15 గంటల మధ్య ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేటకు చేరుకొని అక్కడి నుండి 4.15కు ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరి వెళ్తారు.
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఐఎస్బీతో పాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్సీయూలలో భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఒక్క ఐఎస్బీలోనే 2వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సైబరాబాద్ ఇన్ఛార్జి కమిషనర్ సీవీ ఆనంద్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.