• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » బిగ్ స్టోరీ » జగన్‌పై అలకతోనే బీజేపీ గూటికి మోహన్ బాబు…?

జగన్‌పై అలకతోనే బీజేపీ గూటికి మోహన్ బాబు…?

Last Updated: January 6, 2020 at 6:42 pm

ప్రధాని నరేంద్రమోడీతో సినీ నటుడు మోహన్ బాబు భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బీజేపీలో చేరాలని మోడీ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. అయితే వైసీపీలో కొనసాగుతున్న మోహన్ బాబు సడెన్ గా ఇలా మోడీని కలవడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.

మోహన్ బాబు సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. నాటి ప్రభుత్వ వ్యవహారశైలిపై ఆయన తీవత్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని అందుకే తాను వైసీపీలో చేరుతున్నానని చెప్పారు. ఆయన పార్టీలో చేరిక సమయంలో మోహన్ బాబుకు జగన్ కీలక హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అనుకున్నట్లుగానే ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో మోహన్ బాబుకు కీలక పదవి రాబోతుందని పొలిటికల్ కారిడార్ లో ప్రచారం సాగింది. మొదట ఆయనను టీటీడీ చైర్మన్ గా నియమిస్తారని ప్రచారం సాగినా… ఆ పదవి జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు. ఆ తరువాత ఆయనకు ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వచ్చాయి. అయితే వైసీపీలో కొనసాగుతున్న మరో నటుడు విజయ్ చందర్‌కు ఆ పదవిని ఇచ్చారు సీఎం జగన్. దీంతో మోహన్ బాబుకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందని ప్రచారం సాగింది. అయినప్పటికీ తనకు రాజ్యసభ సీటు ఖాయమని మోహన్ బాబు భావించారు. కానీ అందుకు జగన్ నుండి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో మోహన్ బాబు బీజేపీ చూస్తున్నారని రాజకీయాల్లో ఊహాగానాలు వినబడుతున్నాయి. జగన్ పై అలకతోనే మోహన్ బాబు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఉంటారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

పైగా ఇటీవల జరిగిన జీఎస్టీ సోదాలు కూడా కారణం కావొచ్చని… మంచు ఫ్యామిలీ చూస్తున్న విద్యాసంస్థల్లో అక్రమాలు జరిగాయంటూ వార్తలు కూడా వినిపించినందున ఏ అంశాలను కూడా తీసిపారేయ్యలేమని టాక్ వినపడుతోంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఆప్ కీలక నిర్ణయం….!

ముంచెత్తిన వరదలు… 35 మంది మృతి

ఆందోళన కలిగిస్తున్న చార్ ధామ్ మరణాలు

కేసీఆర్ మద్యం.. ఆరోగ్యానికి హానికరం!

రాకీబాయ్ లా మారాడు.. ఆస్పత్రిలో చేరాడు!

వేలేరు పీఎస్ నుంచి మల్లన్న విడుదల

వంద నాణెంపై ఎన్టీఆర్ ఫోటో.. ఆర్బీఐతో చ‌ర్చిస్తున్నాం..!

చెప్పేదొక‌టి.. చేసేదొక‌టి..!

చ‌దువు రాని వారికేం తెలుసు.. ప‌రీక్ష‌ల విలువ‌..!

నువ్వా..నేనా ! టఫ్ టైటాన్స్.. రఫ్ రాయల్స్

భార‌త తీరంలో.. విహార నౌక..!

సావర్కర్ బయోపిక్… అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

ఫిల్మ్ నగర్

kgf 2 dialogues

రాకీబాయ్ లా మారాడు.. ఆస్పత్రిలో చేరాడు!

సావర్కర్ బయోపిక్... అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

సావర్కర్ బయోపిక్… అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

ఎఫ్4 ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

ఎఫ్4 ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)