• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » పసుపు రైతులకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలి…!

పసుపు రైతులకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలి…!

Last Updated: January 23, 2023 at 8:30 pm

పసుపు రైతులకు ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. పీఎం ఫసల్​ బీమా యోజన (పీఎంఎఫ్​బీవై) అమలుకు నోచుకోవడంలేదన్నారు. అందుకే పసుపు రైతులకు పరిహారం అందడం లేదన్నారు.

రాష్ట్రంలో గత వర్షాకాలంలో అకాల వర్షాలకు 70 శాతం పసుపు పంటలు దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. మార్కెట్‌లో పసుపు క్వింటాల్ ధర రూ. 6 వేల నుంచి 7500 వరకు ఉన్నప్పటికీ రైతులకు ఏ మాత్రమూ గిట్టుబాటు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.

ఈ విషయంలో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కోరిందా అంటే అదీ లేదన్నారు. ఈ అంశంపై లోక్‌సభలో‌ ప్రస్తావించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనా రాలేదని సమాధానం వచ్చిందన్నారు. ఈ క్రమంలో పసుపు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చినట్లు పసుపు రైతులకు బోనస్ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ విషయంలో మంత్రి ప్రశాంత్​రెడ్డి చొరవ తీసుకోవాలని ఆయన అడిగారు. మంత్రి కేటీఆర్ ప్రతి ఏటా దావోస్ వెళతారని అన్నారు. ఈ 9 ఏండ్ల కాలంలో కనీసం రాష్ట్రానికి ఒక్క పరిశ్రమనైనా తీసుకు వచ్చారా అని ఆయన డిమాండ్ చేశారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

కేసీఆర్ కు షూ చూపిస్తూ షర్మిల సవాల్

ఆయన బదిలీపై సంబరాలు..ఈయన బదిలీ వద్దంటూ నిరసనలు!

శ్రీకాకుళంలో వింత డ్రోన్‌ కలకలం!

నగరానికి చేరుకున్న యువ క్రికెటర్లు!

రంగంలోకి దిగిన ఆర్బీఐ.. స్థానిక బ్యాంకులతో టచ్ !

నగ ఎత్తుకెళ్ళిన నాటీ ఎలుక…!

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ఫిల్మ్ నగర్

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap