ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఏపీ తీసుకోచ్చిన జీవో 203 అమలు కాకుండా చూడాలని డిమాండ్ చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. పోతిరెడ్డి పాడు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 6 నుంచి 8 టీఎంసీల నీటిని తరలించుకు పోయేందకు ఏపీ ప్రయత్నిస్తోదన్నారు. అదే జరిగితే దక్షిణ తెలంగాణ ఎడారి అవుతోందన్నారు కోమటిరెడ్డి. పాలమూరు రంగారెడ్డి, డిండి, SLBC, ఉదయ సముద్రం ప్రాజెక్టులకు నీటి కరువు ఏర్పడుతోంది.
పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు అమలైతే నాగర్జున సాగర్ కు చుక్క నీరు రాదు. ఆయకట్టు రైతులు సాగు నీరు, తాగు నీటికి ప్రజలు ఇబ్బందులు పడుతారు. జంటనగరాలు దాహర్తితో అల్లాడే ప్రమాదం ఉంది. తక్షణం పోతిరెడ్డి పాడు పనులను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలి. కృష్ణ బేసిన్ లో ని తెలంగాణ ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా నిధులు కేటాయించాలి. లేని పక్షంలో ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ పెరిగే అవకాశం ఉంది. పోతిరెడ్డి పాడు విస్తరణ పనులు జరిగితే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. చలో పోతిరెడ్డి పాడు కార్యక్రమం నిర్వహించి కేసీఆర్ విధానాన్ని ఎండగడతామన్నారు. పోతిరెడ్డి పాడు ఉద్యమాన్ని కూడా ఉదృతం చేస్తామన్నారు.