ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఎంపీ రఘురామకృష్ణంరాజు దీక్ష చేపట్టారు. దేవాలయాలను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, దేవాలయాలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన దీక్ష చేపట్టారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఇలాంటి దాడులను అరికట్టకపోతే రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతింటుందని ఎంపీ రఘురామ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతర్వేధి రథం కాలి బుడిదవటంపై పోలీసుల మాటలు నమ్మశక్యంగా లేవని విమర్శించారు. ఆలయాల రక్షణ, ఆస్తుల విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైన విధానం పాటించాలని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం స్పందించాలన్నారు.