నాగార్జున సాగర్ లో నామినేషన్ల పర్వం తుది ఘట్టానికి చేరటంతో… ప్రచారం జోరు పెరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి జానారెడ్డి ప్రచారంలో ముందుండగా, ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్ తో పాటు బీజేపీ అభ్యర్థులపై క్లారిటీ వస్తుంది. ఇప్పటికే హాలియాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించింది. అయితే, ఈ సభకు రేవంత్ రెడ్డి హజరుకాలేదు. కరోనా సోకటం వల్ల ఆయన సభకు రాలేకపోయారు.
కరోనా నుండి కోలుకుంటున్న రేవంత్ రెడ్డి… సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఏప్రిల్ 8 నుండి నాలుగైదు రోజుల పాటు రేవంత్ అక్కడే మకాం వేయనున్నారు. ప్రతి మండలాన్ని కవర్ అయ్యేలా ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. రేవంత్ రావటం ఖాయం కావటంతో… ఆయన రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు.
ఏ చోట్ల ప్రచారం చేయాలనే అంశంపై జానారెడ్డి, రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ మ్యాప్ ఖరారు కానుంది.