పేదలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రకరకాల స్కీమ్ ల పేరుతో.. స్కాములు చేస్తూ పేదల పొట్ట కొట్టి రోడ్డున పడేస్తోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శలు చేశారు. ములుగు జిల్లా కలెక్టరేట్ లో రైతు పోరు ధర్నాలో ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే సీతక్క ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాలో సీతక్క మాట్లాడారు.
రైతులకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ఆరోపణలు చేశారు.
పోడు భూములకు పట్టాలివ్వటంతో పాటు.. రైతు రుణమాఫీ చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం పేదల సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్యే సీతక్క.