సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో సెలబ్రిటీలు కూడా చిక్కుకుంటున్నారు. సెల్ఫ్ జడ్జిమెంట్ లేకుండా వాళ్ళు అడిగినట్టు చేస్తే మన ఖాతాలో ఉన్న సొమ్మంతా ఖతమ్ అంతే..! తాజాగా ప్రముఖ నటి శ్వేతా మీనన్ సైబర్ మోసానికి బలయ్యారు.
కేవైసీ, పాన్ వివరాలను అప్డేట్ చేయాలంటూ వచ్చిన ఓ లింక్పై క్లిక్ చేయడంతో కేవలం మూడు రోజుల వ్యవధిలో లక్షల రూపాయలు కొల్లగొట్టారు.పాన్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని, లేనిపక్షంలో బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని సైబర్ నేరగాళ్లు పంపిన లింక్పై క్లిక్ లక్షల్లోడబ్బు నష్టపోయారు.
దాదాపు 40 తమ ఖాతాలో ఉన్న డబ్బులు పోగొట్టుకున్నారు. వీరిలో నటిశ్వేతామీనన్ కూడా ఉన్నారు. ఇటీవల తన మొబైల్కి వచ్చిన లింక్ను క్లిక్ చేసి తన కస్టమర్ ఐడీ, పాస్వర్డ్, ఓటీపీ నమోదు చేశానని, తన ఖాతా నుంచి రూ.57 వేలకుపైగా కట్ అయ్యినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిజానికి బ్యాంక్ కస్టమర్లు తమ గుర్తింపును ధ్రువీకరించుకోవడానికి కేవైసీ చేయించుకోవడం తప్పనిసరైనప్పటికీ అందుకోసం బ్యాంకులు ఎలాంటి మెసేజ్లను పంపవు బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్/యాప్ల ద్వారా ఆన్లైన్లో ఈ-కేవైసీ నమోదు చేసుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచ్లకు వెళ్లి కూడా ఈ-కేవైసీ చేయించుకోవచ్చు.