అంతర్జాతీయ వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల రూ.3.30 లక్షల కోట్లతో ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ ప్రక్రియ ఇంకా కార్యరూపం దాల్చకపోవడంపై ఎలాన్ మస్క్ స్పందించారు. ట్విట్టర్ లో ఉన్న స్పామ్ ఖాతాల సంఖ్యపై స్పష్టత వస్తేనే ఈ కొనుగోలు ఒప్పందం ముందుకు సాగుతుందని వెల్లడించారు.
ట్విట్టర్ లో ఉన్న మొత్తం ఖాతాల సంఖ్యలో.. నకిలీ ఖాతాల సంఖ్య 5 శాతం కంటే తక్కువ ఉన్నట్టు ట్విట్టర్ నిర్వాహకులు పక్కా ఆధారాలు చూపిస్తేనే తాను కొనుగోలుకు ముందడుగు వేస్తానని మస్క్ తేల్చి చెప్పారు. ట్విట్టర్ ఎస్ఈసీ ఫైలింగ్స్ ఎంత నిక్కచ్చిగా ఉన్నాయన్న దానిపైనే తన ఆఫర్ భవిష్యత్తు ఆధారపడి ఉంటోందని స్పష్టం చేశారు మస్క్.
స్పామ్ అకౌంట్లు 5 శాతం కంటే తక్కువ ఉన్నాయని చూపడానికి ట్విట్టర్ సీఈవో బహిరంగంగానే నిరాకరించాడని మస్క్ తెలిపారు. అయితే.. ఈ ఒప్పందంలో పురోగతి కనిపించాలంటే స్పామ్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో చెప్పాల్సిందేనన్నారు.
Advertisements
ట్విట్టర్ చెప్తున్న దానికంటే నకిలీ ఖాతాల సంఖ్య నాలుగు రెట్లు అధికంగా ఉండొచ్చని భావిస్తున్నామని వివరించారు. ఈ మేరకు మస్క్ ఓ ట్వీట్ చేశారు. బహుశా 20 శాతం స్పామ్ అకౌంట్లే అయ్యుంటాయని ట్వట్టర్ అకౌంట్ లో రాసుకొచ్చారు మస్క్.