హైదరాబాద్ : కేటీఆర్కు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాంచి రిటార్ట్ ఇచ్చారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కమెంట్పై కిషన్రెడ్డి చాలా సీరియస్గా స్పందించారు. కేటీఆర్ ఎవరో తెలియదని తాము కూడా అనగలమని.. కానీ తమకు సభ్యత అడ్డొస్తోందని అన్నారు. కేటీఆర్ అహంకారానికి ఇది సంకేతమని అన్నారాయన. నడ్డా ఎవరో తెలియదని చెప్పిన కేటీఆర్.. గతంలో ఆయన్ని ఎలా కలిశారో చెప్పాలని అన్నారు. తెలంగాణలో బీజేపీ లేదని కేటీఆర్ అంటున్నారని, ఐతే మరి నిజామాబాద్లో తన సోదరి కవిత ఎలా ఓడిపోయిందో చెప్పాలని అన్నారు. సుష్మ స్వరాజ్ చనిపోతే కనీసం చూడని వ్యక్తులు ఇపుడు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
ఆయుష్మాన్ భవ బక్వాస్ అన్న టీఆర్ఎస్ నాయకుల దృష్టిలో ఆరోగ్యశ్రీ మంచిదైనప్పుడు.. ధర్నాలు ఎందుకు చేస్తున్నారో వివరించి చెప్పాలన్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని కిషన్ రెడ్డి చెప్పారు.
అమరావతి గురించి నాకు తెలియదు..
ఏపీ రాజధాని మారుతుందన్న విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. అది కేంద్రం పరిధిలోకి రానిదని అన్నారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అనే వార్తల్లో వాస్తవం లేదని తేల్చారు.