• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » నాగోబా జాతర.. తరలివస్తున్న ఆదీవాసీలు

నాగోబా జాతర.. తరలివస్తున్న ఆదీవాసీలు

Last Updated: January 21, 2023 at 1:39 pm

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతరకు అంతా సిద్ధమయ్యింది. శనివారం అర్థరాత్రి మహాపూజతో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఈ వేడుక కోసం మెస్రం వంశీయులు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. ఒకే చోటుకు.. మూడు రాష్ట్రాల ఆదివాసీలను చేర్చే జాతర నాగోబా. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​ నుంచి ఆదివాసీలు, సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

తెలంగాణ: ప్రముఖ గిరిజన జాతర 'నాగోబా' - VSK Telangana

కాలినడకన 80 కిలో మీటర్ల దూరంలోని జన్నారం మండలంలోని కలమడుగు హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గోదావరి జలాన్ని పుష్య అమావాస్యకు ఒకరోజు ముందు కేస్లాపూర్ లోని మర్రిచెట్టు వద్ద ఉంచుతారు. అనంతరం నాగ దేవునికి గంగా జలంతో అభిషేకం చేస్తారు. పుష్యమాసపు అమావాస్య అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటే.. ఆదిలాబాద్ లోని కేస్లాపూర్ ‌లో మాత్రం దేదీప్యమానమైన వెలుగుల మధ్య ఈ జాతర మొదలవుతుంది.

చిమ్మ చీకట్లలో చల్లటి గాలుల మధ్య దట్టమైన అడవి పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. తర తరాల సంప్రదాయంగా.. అడవిబిడ్డలు ఎంతో నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు జరుపుతారు. నాగోబా జాతర చివరి రోజు జరిగే దర్బార్ ​తో జాతర ముగుస్తుంది. జాతరకు నలుమూల నుంచి వేల సంఖ్యలో వస్తున్న గిరిజనుల సమస్యలు తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో దర్బార్ ఏర్పాటు చేస్తారు.

ఈనెల 24న కలెక్టర్ సిక్తా పట్నాయక్​ అధ్యక్షతన దర్బార్​ ని నిర్వహించనున్నారు. ఈ దర్బార్ కి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు అధికారులు హాజరవుతారు. దీని కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఏటా దర్బార్ లో విన్నవించుకున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బీబీసీ డాక్యుమెంటరీ… థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు….!

తిరుమలలో రథసప్తమి వేడుకలు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

భారీగా పడిపోతున్న ఆదానీ షేర్లు… ఎల్ఐసీ, ఎస్బీఐల సేవింగ్స్ పై ప్రభావం..!

మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు షాక్..!

యువకున్ని కొట్టిన ఎస్ఐ… అడ్డుకున్న మాజీ కలెక్టర్….!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం…!

రాహుల్‌ను కాపీ కొట్టిన మాజీ ముఖ్యమంత్రి….!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

సాహితీ ఇన్ ఫ్రా మోసాలన్నింటిని ఒకే కేసుగా పరిగణించండి..!

ఫిల్మ్ నగర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

ముగిసిన జమున అంత్యక్రియలు

ముగిసిన జమున అంత్యక్రియలు

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap