అఖండ సినిమా అఖండమైన విజయం సాధించిందని అన్నారు నందమూరి బాలకృష్ణ. విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్న ఆయన నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారు. ఇప్పుడు సనాతన దర్మాన్ని కాపాడిన సినిమా అఖండ అని అన్నారు. సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు. ఏదైన పని తలపెడితే విజయం తద్యం అమ్మవారి అశీస్సులతో సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది.మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు.
టిక్కెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నాం..ఏదైతే అదని సినిమా విడుదల చేశామన్నారు. సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్పెప్ వేశాం. కొంతమంది ఆగినా మేమెక్కడా వెనుకడుగు వేయలేదు. అలాగే మంచి కధ వస్తే మల్టీస్టారర్ సినిమా తీస్తామన్నారు బాలయ్య. ఈ చిత్రం విజయం పరిశ్రమకు ఊపిరినిచ్చిందని అన్నారు. అఖండ సినిమా విజయం తో మిగతా వారికి ధైర్యం వచ్చింది. అందరూ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సినిమా టిక్కెట్ల వ్యవహారంపై నా వంతుగా నేను గతంలో మాట్లాడాను.ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ప్రభుత్వం అప్పీల్ కు వెల్తానంటుంది. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి దాని బట్టి స్పందిస్తానని అన్నారు బాలయ్య.