స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు ప్రజల కీర్తి అని కొనియాడారు. సింగిల్ హ్యాండ్ తో సమస్యలను పరిష్కారం చేసేవారని తెలిపారు.
సినిమాల్లోనే కాదని నిజ జీవితంలోనూ ఆయన రియల్ హీరో అని ప్రశంసించారు. రక్తదార శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నారా భువనేశ్వరి.
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్ అని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎన్టీఆర్ ఒక మహనీయుడు అని కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ప్రాంతాల వారీగా 30 రోజులు పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కాసాని పేర్కొన్నారు.