నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీ
పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న జగన్ తుంచుకుంటూ పోతున్నారు. రూ.3వేల పెన్షన్ ఇస్తానని ఆశపెట్టి మాట మార్చారు.. మడమ తిప్పారు. 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తానని డాబు కబుర్లు చెప్పి అడ్డమైన కారణాలు చూపిస్తూ భారీగా కోత పెడుతున్నారు.
గత రెండు నెలల్లోనే 2.30 లక్షల పెన్షన్లు లేపేసి అవ్వా తాతలకు తీరని అన్యాయం చేశారు. మీరు పెడుతున్న మానసిక క్షోభ భరించలేక రాష్ట్రవ్యాప్తంగా పెన్షనే ఆధారంగా బతుకుతున్న 13 మంది వృద్ధులు మృతి చెందారు.
మీరిచ్చిన హామీ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు రూ.2,750 పెన్షన్ ఇవ్వాలి. ప్రతీ అవ్వా తాత దగ్గరా నెలకు రూ.500 కొట్టేస్తున్నదేకాక భారీగా పెన్షన్లు కోసేస్తున్న పాపం ఊరికేపోదు జగన్.
ఆరోగ్య సమస్యలు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వారి పెన్షన్లు తీసేయడం సబబు కాదు. ఎత్తేసిన పెన్షన్లు అన్ని వెంటనే ఇవ్వాలి.