భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయింది. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు థియేటర్స్ లో వేట మొదలు పెట్టాడు భీమ్లా నాయక్.
కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం థియేటర్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రతి ‘భీమ్లా నాయక్’ థియేటర్ స్క్రీనింగ్ వద్ద పోలీసు, రెవెన్యూ అధికారులు కనిపిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, అధికారులు నిర్ణయించిన దానికంటే తక్కువ ధరలకు టిక్కెట్లను విక్రయించాలని థియేటర్ యాజమాన్యంపై ఒత్తిడి చేస్తున్నారు.
పవన్ సినిమాపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. “భీమ్లా నాయక్ కి అద్భుతమైన స్పందన వినిపిస్తోంది. ఇది చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను. వైఎస్ జగన్ ఒక పరిశ్రమ తర్వాత మరో పరిశ్రమను ముగించడం ద్వారా ఏపీని భిక్షాటన చేసే గిన్నెగా మార్చాలనుకుంటున్నారు. సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదు.
భీమ్లానాయక్ అన్ని కుట్రలను అధిగమించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు లోకేష్.
నిజానికి ఏపీ ప్రభుత్వ చర్యతో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలత చెందుతున్నారు. ఎగ్జిబిటర్లు వ్యాపారానికి దూరంగా ఉండాలని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ చైర్మన్ ఎన్వీ ప్రసాద్ అన్నారు. ఇది పవన్పై దాడి కాదు, మొత్తం ఎగ్జిబిషన్ పరిశ్రమపై దాడి. అధికారులు థియేటర్లను తనిఖీ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటూ ఎన్వీ ప్రసాద్ అన్నారు.
Hearing tremendous response for #BheemlaNayak. Looking forward to watching it. @ysjagan wants to transform AP into a begging bowl by finishing off one industry after another, movie industry being no exception. I wish #BheemlaNayak overcomes all conspiracies to come out triumphant pic.twitter.com/cqn636HsCU
— Lokesh Nara (@naralokesh) February 25, 2022