నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు జగన్ కరెంట్ షాక్ ఇస్తే.. పెట్రోల్, డీజిల్ ఇతర ధరలను మోడీ పెంచుతున్నారు. పోలవరం విషయంలోనూ మోడీ, జగన్ డ్రామాలాడుతున్నారు. ఏపీ ప్రజలు 151 సీట్లు ఇచ్చినా జగన్ కు బానిస బతుకు అవసరమా?
బీజేపీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోంది. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. వాటన్నింటికీ గవర్నర్ ఆమోదం ఎలా తెలుపుతారు. కేంద్రం కూడా ఆమోదించబట్టే.. గవర్నర్ సంతకాలు చేస్తున్నారు. తానే గవర్నర్ గా ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడిని. గత ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు అయినా వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో జగన్ అవి కూడా రావు.
జిల్లాల పునర్విభజన ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు. ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సంప్రదింపులు జరపలేదు. జిల్లాల ఏర్పాటు జగన్ సొంత వ్యవహారం అనుకుంటున్నారా?. పేర్ని నాని విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా?. ఆయన ఇకనైనా బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి.
జగన్ పాలనపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. కేరళలో అక్టోబర్ 14 నుంచి సీపీఐ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఎర్ర జెండాల ప్రాముఖ్యత పెరగాలంటే సీపీఐ, సీపీఎం కలవాల్సిన అవసరం ఉంది.