టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పెళ్లిపీటలెక్కారు. సహనటి పవిత్రా లోకేష్ మెడలో మూడుముళ్లువేశాడు. పవిత్రా లోకేష్తో తన పెళ్లి జరిగినట్లు శుక్రవారం ట్విట్టర్ ద్వారా నరేష్ ప్రకటించారు. పెళ్లి వీడియో ను పోస్ట్ చేశారు.
ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు.. ఏడు అడుగులు… తమ జీవితకాల ప్రయాణానికి అందరి ఆశీస్సులు కావాలి అంటూ ఈ ట్వీట్లో నరేష్ పేర్కొన్నాడు. సంప్రదాయబద్దంగా నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి జరిగింది.
వీరి పెళ్లికి కొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితులుమాత్రమే హాజరైనట్లు తెలిసింది. తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ ఏడాది ఆరంభంలో నరేష్, పవిత్రా లోకేష్ ప్రకటించారు. నరేష్కు ఇది నాలుగో పెళ్లి కాగా పవిత్రా లోకేష్కు రెండో పెళ్లి. చాలా సినిమాల్లో నరేష్, పవిత్రా లోకేష్ కలిసి నటించారు.
మూడో భార్య రమ్య రఘుపతితో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నాడు నరేష్. ఈ వివాదం పూర్తిగా సమసిపోకముందే పవిత్రా లోకేష్ ను నరేష్ పెళ్లి చేసుకోవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023