తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రజలు శాంతిభద్రతల విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నారని రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ అన్నారు. ఆయన శుక్రవారం నార్సింగి పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించారు.
పోలీసు శాఖ వారికి అన్ని వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో 64 శాతం కెమెరాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఒకప్పుడు ప్రజలు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే భయపడేవాళ్లు.. కానీ ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ విధానం వచ్చాక ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారన్నారు మంత్రి మహమ్మద్ అలీ. ఈ కార్యక్రమంలో పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎంపీ రంజిత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాధ్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సైబరాబాద్ కమిషనరేట్ సిపి స్టీఫెన్ రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.