దేశ విభజన తర్వాత పాకిస్తాన్ లో హిందువుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ మేరకు సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పాకిస్తాన్ ఓ నివేదికను వెల్లడించింది. పాకిస్తాన్ లో 22,10,566 మంది హిందువులు నివసిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
దేశంలో నమోదైన మొత్తం 18,68,90,601 మంది జనాభాలో.. మైనారిటీ హిందువుల వాటా 1.18% మాత్రమేనని తేల్చి చెప్పింది. మైనారిటీల వాటా 5% కాగా.. వీరిలో హిందువులే అత్యధికులని ఈ నివేదిక స్పష్టం చేసింది.
దేశంలో 1,400 మంది నాస్తికులు సహా.. 17 వేర్వేరు మతాలు, ఆచారాలను గుర్తించినట్లు మార్చిలో ఎన్ఏడీఆర్ఏ డేటా ఆధారంగా వెల్లడైంది. హిందూ జనాభాలో 95% మంది సింధ్ ప్రావిన్స్లోనే నివసిస్తున్నారని పేర్కొంది.
పేదరికంలో మగ్గుతున్న మైనారిటీల ప్రాతినిధ్యం పాక్ చట్టసభల్లో దాదాపుగా లేనట్లేనని వివరించింది. మైనారిటీలపై వేధింపులు సర్వసాధారణమని ఈ నివేదిక తెలిపింది.