ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెత్తిన కరోనా వైరస్.. ఇప్పుడు భారత్ ను అతలాకుతలం చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ టాలీవుడ్ హీరోలు పిలుపునిస్తున్నారు. మార్చి నెలలో కరోనాను అంతమొందిద్దాం, ఏప్రిల్ లో పండగ చేసుకుందాం అంటూ ఇటీవలే కరోనా మహమ్మారిపై ఉత్సాహభరితమైన ట్వీట్ చేసిన టాలీవుడ్ హీరో నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, కులం, మతం, డబ్బు, పేరు ప్రతిష్ఠలు అంతా మిథ్య అని, చివరికి మనిషికి మనిషే తోడు అని అభిప్రాయపడ్డారు. మనందరం ఒకే కుటుంబం అంటూ, ప్రతి ఒక్కరూ తోటివారి క్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. బాధ్యతగా మెలగండి, సురక్షితంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.
పాలిటిక్స్, కులం, మతం, పవర్, డబ్బు, ఫేమ్ తొక్క తోలు ఏమీ ఉండదు చివరకి
మనిషికి మనిషే
We are all one big family and we need to take care of each other #BeResponsible #BeSafe
— Nani (@NameisNani) March 17, 2020
మరో వైపు టాలీవుడ్ అగ్రహీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.