నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చైన్నై వెళ్తున్న నవ జీవన్ ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు.
వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్ మహబూబాబాద్ స్టేషన్లలోనే రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే మహబూబాబాద్ స్టేషన్ కు చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
అయితే ట్రైన్ బ్రేక్ లైనర్స్ పట్టివేయడంతో దట్టమైన పొగ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. రైలును మహబూబాబాద్ స్టేషన్ లోనే నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.