• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » International » డ్రాగన్ కంట్రీలో కరోనా బీభత్సం…. 30 రోజుల్లో 60 వేల మంది…!

డ్రాగన్ కంట్రీలో కరోనా బీభత్సం…. 30 రోజుల్లో 60 వేల మంది…!

Last Updated: January 15, 2023 at 2:17 pm

చైనాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా కాటుకు కేవలం 30 రోజుల్లోనే 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో జీరో కొవిడ్ పాలసీని గతేడాది డిసెంబర్ 8న ప్రభుత్వం ఎత్తి వేసింది. అప్పటి నుంచి డ్రాగన్ కంట్రీలో కరోనా విలయ తాండవం చేస్తోంది.

డిసెంబర్‌ 8 నుంచి జనవరి 12 మధ్య కరోనా లక్షణాలతో 59,938 మృతి చెందినట్టు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌‌సీ) వెల్లడించింది. వారిలో 5,503 మంది శ్వాస సంబంధిత సమస్యలతో మరణించినట్టు పేర్కొంది. 54,435 మంది ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. మరణించిన వారి సగటు వయస్సు 80 ఏండ్లుగా ఉందని పేర్కొంది. మృతుల్లో అత్యధికంగా 90 శాతం మంది 65 ఏండ్లకు పైబడినవారే ఉన్నట్టు వెల్లడించింది.

కరోనా విజృంభణ నేపథ్యంలో జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అయితే భయపడాల్సిన పని లేదని క్రమంగా ఈ సంఖ్య తగ్గుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్‌ నాటికే 76 శాతం మంది వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది.

ఈ నెల చివర వరకు ఆ సంఖ్య 92 శాతానికి చేరుతుందని తెలుస్తోంది. ఇక ఈ నెల 22 నుంచి చైనాలో న్యూ ఇయర్‌, స్ప్రింగ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రాబోయే 2, 3 నెలల్లో కరోనా తీవ్రస్థాయికి చేరుకుంటుందని అంటున్నారు.

జనవరి 11 నాటికి చైనా వ్యాప్తంగా 90 కోట్ల మంది కరోనా బారినపడినట్టు పెకింగ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. ప్రస్తుత చైనా జనాభా 141 కోట్లలో ఇది సుమారు 64 శాతం. అత్యధికంగా గాన్సు ప్రావిన్స్‌ లో 91 శాతం మంది ప్రజలు వైరస్‌ బారిన పడినట్లు అధ్యయనంలో వెల్లడైంది.

Primary Sidebar

తాజా వార్తలు

మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు షాక్..!

యువకున్ని కొట్టిన ఎస్ఐ… అడ్డుకున్న మాజీ కలెక్టర్….!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం…!

రాహుల్‌ను కాపీ కొట్టిన మాజీ ముఖ్యమంత్రి….!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

సాహితీ ఇన్ ఫ్రా మోసాలన్నింటిని ఒకే కేసుగా పరిగణించండి..!

పోలీసుల నోటీసులకు బండి భగీరథ్ రిప్లై…!

కేసీఆర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..!

ముగిసిన జమున అంత్యక్రియలు

అందుకే తేజస్వీ యాదవ్‌ను సీఎంగా నితీశ్ ఎంచుకున్నారు…!

ఖమ్మం కయ్యం.. కౌంటర్ ఎటాక్స్ తో హీట్ 

ఫిల్మ్ నగర్

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

ముగిసిన జమున అంత్యక్రియలు

ముగిసిన జమున అంత్యక్రియలు

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap