• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ట్రెండింగ్ లో బ్లీచింగ్ పౌడర్ .. జగన్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Published on : March 16, 2020 at 12:23 pm

ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ట్విట్టర్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి మోడీ వరకు ఎవరైనా సరే ఎక్కడైనా ఎమన్నా తప్పుగా నోరు జారి మాట్లాడి దొరికిపోతే ఇంకా ట్విట్టర్ లో వాళ్ళ పరిస్థితి అంతే. ఇతర సామాజిక మాధ్యమాల కంటే ట్విట్టర్‌ వినియోగదారుల్లో అత్యధికులు విద్యావంతులు, వృత్తి నిపుణులు ఉన్నారు. మన నాయకులు ఎక్కడ టంగ్‌ స్లిప్ అయినా ఒక రేంజ్ లో నెటిజన్లు ఆడేసుకుంటారు. వారి తెలివి తక్కువతనాన్ని బట్టబయలు చేయటమే కాదు బట్టలు చిరిగేదాకా ఉతుకుతారు. ఆ ఉతుకుడు బారిన పడిన వాళ్లలో మన ప్రధాని మోడీ నుంచి యువ నేత రాహుల్ గాంధీ వరకూ ఉన్నారు.

ఇప్పుడు వారి సరసన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేరారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోతుందని, పారాసిటమల్ వేసుకుంటే సరిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గత 24 గంటల నుంచి నెటిజన్లు జగన్ ను ఏకిపారేస్తున్నారు. ఎంతలా అంటే.. జగన్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు అనటానికి ఉదాహరణ ఏంటంటే ట్విట్టర్‌లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ ట్రిండింగ్ అయిన పదం #BleachingPowder. పిడికెడు బ్లీచింగ్ పౌడర్ లేకనే అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాలు అల్లాడుతున్నాయా.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కరోనా మందు కనుగొన్న ఆంధ్రా సీఎంకి వైద్యరంగంలో నోబుల్ ఇవ్వాల్సిందేనని వెటకారంగా ఏకిపడేస్తున్నారు. కేవలం ఏపీ నుంచి కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విమర్శలు రావటంతో ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లోకి ఏపీ సీఎం కామెంట్ బ్లీచింగ్ పౌడర్ చేరింది.

జగన్ ప్రమాణ స్వీకారం చేసి 10 నెలలు అయింది. ఇప్పటిదాకా ఇసుక కొరత, మూడు రాజధానులు, అమరావతి తరలింపు వంటి కీలక సమస్యలు ఉన్నా మీడియా సమావేశం పెట్టని సీఎం తొలిసారి కరోనాపై పెట్టిన ప్రెస్‌మీట్‌లో ఇలా బుక్కయిపోవటంతో ఇంకోసారి ప్రెస్‌మీట్‌ పెట్టకపోవచ్చని కొందరు జాతీయ మీడియా ప్రతినిధులు కామెంట్ చేయటం విశేషం.

tolivelugu app download

Filed Under: బిగ్ స్టోరీ, రాజకీయాలు, వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ప్రగ్యా జైస్వాల్ తో మాస్ స్టెప్స్ వేస్తున్న బాలయ్య

ప్రగ్యా జైస్వాల్ తో మాస్ స్టెప్స్ వేస్తున్న బాలయ్య

మాస్టర్ మార్క్ గట్టిగానే ఉంది..!!

మాస్టర్ మార్క్ గట్టిగానే ఉంది..!!

పెళ్లయింది... అయితే ఏంటి ?

పెళ్లయింది… అయితే ఏంటి ?

పాయల్ కు అవకాశం ఇచ్చిన అజయ్ భూపతి

పాయల్ కు అవకాశం ఇచ్చిన అజయ్ భూపతి

ఉగాది బరిలో గోపీచంద్

ఉగాది బరిలో గోపీచంద్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

అబ‌ద్ధాల అధ్య‌క్షుడిగా ట్రంప్ రికార్డు.. దివాషింగ్ట్ పోస్ట్ క‌థ‌నం

అబ‌ద్ధాల అధ్య‌క్షుడిగా ట్రంప్ రికార్డు.. దివాషింగ్ట్ పోస్ట్ క‌థ‌నం

ప్ర‌జ‌లు బాధ‌ల్లో.. ప్ర‌భుత్వం ప‌న్ను వ‌సూళ్ల‌లో- రాహుల్ గాంధీ

ప్ర‌జ‌లు బాధ‌ల్లో.. ప్ర‌భుత్వం ప‌న్ను వ‌సూళ్ల‌లో- రాహుల్ గాంధీ

సంచ‌ల‌నం.. కేసీఆర్‌ను క‌లవాలంటూ పత్రికా ప్ర‌క‌ట‌న!

సంచ‌ల‌నం.. కేసీఆర్‌ను క‌లవాలంటూ పత్రికా ప్ర‌క‌ట‌న!

దేశంలో నిల‌క‌డ‌గా క‌రోనా ఉధృతి

దేశంలో నిల‌క‌డ‌గా క‌రోనా ఉధృతి

గుంటూరు- క‌రోనా టీకా తీసుకున్న ఆశా వ‌ర్క‌ర్ మృతి

గుంటూరు- క‌రోనా టీకా తీసుకున్న ఆశా వ‌ర్క‌ర్ మృతి

తెలంగాణ‌లో కొత్త‌గా 197 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో కొత్త‌గా 197 క‌రోనా కేసులు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)