జగన్ అక్రమాస్తుల కేసు మరో మలుపుతిరిగింది. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ సి.వి.ఎస్ కె శర్మ పై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వం నుండి న్యాయ సహాయం పొందిన ఆయన నకిలీ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు పొందారంటు సైఫాబాద్ పోలీసులకు పి.వి రమణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. బిల్లుల విడుదల విషయంలో లో శర్మకు మాజీ సీఎస్ పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పి వి రమేష్ సహకరించార ఫిర్యాదులో రమణ పేర్కొన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఐఏఎస్ లకు అప్పటి ప్రభుత్వం న్యాయ సహాయానికి నిధులు విడుదల చేసిందని,అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి సి వి ఎస్ కె శర్మ ప్రభుత్వానికి న్యాయ సహాయ బిల్లులు అందజేయడంలో చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపించారు రమణ.తప్పుడు బిల్లులతో లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్టు సైఫాబాద్ పోలీసులకు తెలిపారు.
శర్మ పెట్టిన బిల్స్ ను సరిగా పరిశీలించకుండా ఆనాటి సిసిఎస్ పీకే మహంతి సంతకాలు చేశారని ఫిర్యాదులో రమణ పేర్కొన్నారు.దీనిపై అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి టి వి రమేష్ నిధులు విడుదల చేశారని, ఈ వ్యవహారం పై కేసు నమోదు చేయాలని పి.వి రమణ కోర్టును ఆశ్రయించారు.కోర్టు ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.