అక్టోబర్ నెల మొదటి సోమవారం ట్రేడింగ్ సెషన్ లో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లను, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లను కోల్పోయింది.
చమురు సంస్థలు ఉత్పత్తిని తగ్గించే అవకాశాలున్నాయనే ఆందోళనలతో క్రూడ్ ఆయిల్ ధరలు కొంతమేర పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీలో నష్టాల పరంపర ఇవాళ కూడా కొనసాగింది.
ఉదయం 9 గంటల 46 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 344 పాయింట్లు నష్టపోయి 16,989 పాయింట్లకు చేరగా, నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 17,026 పాయింట్లకు చేరింది.
నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 38,443 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ద్రవ్యోల్బణం రేట్లు కూడా అంతకంతకూ పెరుగుతుండటంతో పాటు కరెన్సీ మార్కెట్లలో ఆకస్మిక కదలికలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో స్ట్రెయిట్ టైమ్స్ (సింగపూర్), హాంగ్ సెంగ్ (హాంకాంగ్), ఎస్జీఎక్స్ నిఫ్టీ (సింగపూర్), జకార్తా కంపోజిట్ (ఇండోనేషియా), షాంఘై కంపోజిట్ (చైనా) సహా పలు ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు రెడ్ జోన్ లో కదలాడాయి. వాటి బాటలోనే ఇండియా స్టాక్ మార్కెట్లు కూడా నడిచాయి.