• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » కేసీఆర్ పాల‌నలో క‌రెంట్ కోత‌లు.. ఎండుతున్న పంట‌లు

కేసీఆర్ పాల‌నలో క‌రెంట్ కోత‌లు.. ఎండుతున్న పంట‌లు

Last Updated: March 31, 2022 at 4:15 pm

– ఐదురోజులుగా రాత్రి పూట క‌రెంట్ క‌ట్
– వ‌రిపంట‌కు నీరంద‌క ఎండిపోతోందంటున్న‌రైతులు
– నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గంలో ఇబ్బందులు
– పంట చేతికి అందే స‌మయానికి కోత విధించిన అధికారులు
– 15 రోజులు 24 గంట‌లు ఇవ్వాల‌ని వేడుకుంటున్న రైతులు
– సాంకేతిక లోపాల కార‌ణ‌మే అంటున్న అధికారులు

ఆరుగాలం కష్ట ప‌డి పండించిన పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర అందించ‌కుండా రైతుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్న ప్ర‌భుత్వం.. ఇప్పుడు క‌రెంట్ కోత పెట్టి రైతుల కంట క‌న్నీరు తీసేలా చేస్తోంది. నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో సాధించుకున్న రాష్ట్రంలో.. క‌రెంట్ కోత విధించడంతో రైతుల కంట నీరు కాలువ‌లై పారుతున్నా ప్ర‌భుత్వానికి ప‌ట్టింపులేకుండాపోయింద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇగ నిధులు, నియామకాల సంగ‌తి స‌రేస‌రి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా వ్యవసాయానికి రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశార‌ని రైతులు వాపోతున్నారు. దీంతో చేతికి అందిన పంట క‌ళ్ల ముందే ఎండిపోతుంటే.. గుండె త‌రుక్కు పోతోంద‌ని రైతులు కంట‌నీరుపెట్టుకుంటున్నారు. ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న తీరుతో కంటిమీద కునుకులేకుండాపోతోంద‌ని వాపోతున్నారు.

క‌రెంట్ కోత కార‌ణంగా నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లి, లోలం, అన్సన్​పల్లి, ధర్పల్లి మండలంలోని మద్దులతాండ, వాడి, హొన్నజీ పేట్, సిరికొండ మండలంలోని ముషీర్ నగర్, రావుట్ల గ్రామాల్లో పంట‌కునీరు అంద‌క.. ఎండిపోయిన వ‌రిపోలాల‌లో ప‌శువుల‌ను మేపుతున్నారు కొంద‌రు రైతులు. ఇంకొంద‌రు మాత్రం.. చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు క‌రెంట్ ఉన్న స‌మ‌యంలోనే జనరేటర్ల సాయంతో మోటర్లు నడుపుతున్నారు.ఎలాగైనా పొట్ట‌కొచ్చిన పంట‌ను కాపాడుకునేందుకు స‌ర్వ‌విధాలా క‌ష్ట ప‌డుతున్నామంటున్నారు.

కాగా.. ప్ర‌భుత్వం 24 గంట‌ల క‌రెంట్ ఇస్తుంద‌నే దైర్యంతో 18 ఎక‌రాల పొలం కౌలుకుతీసుకున్నామ‌ని.. క‌రెంట్ కోత‌తో పొలం అంతా ఎండిపోతోంద‌ని జిల్లాకు చెందిన ఓ రైతు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు. ఈ పంట చేతికి వ‌చ్చేంత వ‌ర‌కు ఓ 10 నుంచి 15 రోజులు పాటు 24 గంట‌ల క‌రెంట్ ఇవ్వాల‌ని కోరుతున్నాడు. క‌రెంట్ కోత విధించి త‌మ పొట్ట కొట్టొద్ద‌ని వేడుకుంటున్నాడు.

నీరు పుష్కలంగా ఉన్నా.. విద్యుత్ సరఫరాలో అంతరాయానికి ముందే ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో దాదాపు 20 ఎకరాల్లో పంటలు ఎండిపోవడానికి అధికారులే కారణమని కర్షకులు ఆరోపించారు. 15 రోజుల క్రితం భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు. కనీసం రెండు తడులకు చెరువు నీరు ఇవ్వాలని తహసీల్దార్ ను వేడుకున్న‌ప్ప‌టికీ.. పట్టించుకోలేదని ఆరోపించారు. చెరువులో నీరు పుష్కలంగా ఉన్న‌ప్ప‌టికీ ఆయకట్టు పొలాలు ఎండిపోయాయని వాపోయారు. ఇదంతా ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పిద‌మేన‌ని అంటున్నారు బాధిత రైతులు. కాగా.. ఉత్పత్తి తగ్గడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే పగటి పూట మాత్రమే క‌రెంట్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

భళా కేజ్రీవాల్‌.. కేసీఆర్‌ ప్రశంసలు!

తొలివెలుగు కథనానికి స్పందన.. చెంచులక్ష్మికి చేయూత!

ఎవరి సొమ్ము.. ఎవరికి? పద్దతేనా సారూ?

పోలీసులు ఎందుకు కాకీ దుస్తులే ధరిస్తారు…?

తగ్గేదే లే.. ఆర్చరీ వరల్డ్ కప్ లో స్వర్ణం!

అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ముసుగు ఎందుకు వేస్తారు…?

బ్రేకింగ్‌… భారీగా తగ్గిన పెట్రోల్‌ రేట్లు

బిల్లి బౌడెన్ కు ఆ వ్యాధి ఉండటమే ప్లస్ అయిందా…? చేతులు అందుకే అలా లేపేవారా…?

క‌మీష‌న్ల కోసం కుస్తీలు.. బ‌స్తీలతో ప‌నేముంది..!

మోడీ హైదరాబాద్ వ‌స్తుంటే..కేసీఆర్ కు ఢిల్లీలో ఏం ప‌ని..!

అప్పుడు ధ‌నిక రాష్ట్రం.. ఇప్పుడు అప్పుల కుప్ప‌..!

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

ఫిల్మ్ నగర్

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

Sarkaru Vaari Paata Movie OTT Release Date

ఆ డైలాగ్ పై నమ్మకం లేదన్న మహేష్

కీర్తి పేరు మారింది.. ఇకపై అలాగే పిలవాలట!

కీర్తి పేరు మారింది.. ఇకపై అలాగే పిలవాలట!

విమానంలో మూడు గంటలు.. బాలీవుడ్ నటి అవస్థలు

విమానంలో మూడు గంటలు.. బాలీవుడ్ నటి అవస్థలు

త‌మిళ్ సినిమాలో.. గ్లామర్ బ్యూటీ..!

త‌మిళ్ సినిమాలో.. గ్లామర్ బ్యూటీ..!

కేజీఎఫ్-2.. మ‌రో అరుదైన రికార్డ్..!

కేజీఎఫ్-2.. మ‌రో అరుదైన రికార్డ్..!

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)